Hyderabad reports 42 Cororna Cases in 24 hours హైదరాబాద్ లో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. 24గంటల్లో 4 మరణాలు

Covid 19 update hyderabad reports 42 cororna cases 9 of family test positive

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

Telangana reported 42 new cases of COVID-19 on Tuesday, taking the total positive cases in the state to 1,634. All 42 new positive cases reported were from the jurisdiction of the Greater Hyderabad Municipal Corporation (GHMC)

హైదరాబాద్ లో కరోనా విజృంభన.. ఒకే కుటుంబంలోని 9మందికి పాజిటివ్

Posted: 05/20/2020 11:05 AM IST
Covid 19 update hyderabad reports 42 cororna cases 9 of family test positive

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. ఇక మరోవైపు మరణాలు కూడా పెరగడం ప్రభుత్వం, రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతున్న విషయాలకు, జరుగుతున్న పరిణమాలకు పొంతనలేకుండా పోవడంతో హైదరాబాద్ నగరవాసులు కలవరానికి గురవుతున్నారు. ఈ నెల ఆరంభంలో రాష్ట్రవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి.

ఈ నెల 7 నుంచి క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే రాష్ట్రంలో నమోదవుతున్న కేసులన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. నగరంలో ఓ వైపు పరిస్థితి అందోళనకరంగా వున్నా ప్రభుత్వం మాత్రం నాల్గవ విడత లాక్ డౌన్ నేపథ్యంలో సడలింపులకు ప్రాధాన్యత ఇస్తూ.. కంటైన్ మెంట్ జోన్లను మినహాయించి నగరంలోనూ సరిబేసి సంఖ్యలో దుకాణాలను తెరుచుకుని వ్యాపారాలు జరుపుకునేందుకు అనుమతులను మంజూరు చేసింది. ఇక దీంతో పాటు అన్ని పరిశ్రమల్లోనూ నూటికి నూరుశాతం హాజరుతోనూ కార్మికులను అనుమతించింది. ఈ క్రమంలో కరోనా కేసులు పెరుగుతుండటం అందోళన కలిగిస్తోంది.

మంగళవారం నాడు విడుదల చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ ప్రకారం.. ఒకే రోజులో మొత్తం 42 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసులు 1634కు చేరుకున్నాయి. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 585 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 34 పాజిటివ్ కేసులు 34 గుర్తించడం గమనార్హం. అదే సమయంలో తొమ్మిది మంది సభ్యులు గల కుటుంబంలోని అందరికీ కరోనా పాజిటివ్ కేసులు తేలడం కలవరానికి గురిచేస్తోంది. ఇక వీరితో పాటు మరో ఎనమిది మంది వలస కూలీలకు కూడా కరోనా సోకింది. హైదరాబాద్లోని నాలుగు జోన్లలో తప్ప మరెక్కడా కొత్తగా కరోనా కేసులు లేవని బులెటిన్లో వివరించారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. అవి నిష్పలితమవుతున్నాయి. నగరంలో కరోనా వ్యాప్తి చాపకింద నీరులా వ్యప్తి చెందుతూనే వుంది. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అయినా కరోనా వ్యాప్తి చెందుతూనే వుంది. ఇక కరోనా మరణాలు కూడా అందోళన రేకెత్తిస్తున్నాయి. నిన్న ఒక్క రోజు నాలుగు మరణాలు సంభవించాయి. వీరిలో ఇద్దరు వృద్దలు, వారిలో ఒకరి వయస్సు 75, మరోకరి వయస్సు 70గా వైద్యవర్గాలు తెలిపాయి. ఇక కాగా మరో డెబై ఏళ్ల వృద్ద మహిళ కూడా వుంది. ఇక మరో ముఫై ఏళ్ల మహిళ కూడా మరణం కబళించడం అందోళన కలిగిస్తోంది. తొమ్మది మంది మహిళలు నిన్న డిశ్చార్జ్ కాగా, 1011 మంది ఇప్పటివరకు డిశ్చార్జ్ కాగా, 585 మంది చికిత్స పోందుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles