పల్లెటూరి పిల్ల.. పట్టణానికి వస్తేనే అయోమయంగా వుంటుంది.. ఇక మహానగరానికి వస్తే.. అ వెంటనే గత మూడు నాలుగు తరాల ప్రజలు ఎన్నడూ చూడని పరిస్థితులు ఉత్పన్నమై.. అమెకు తన కన్నవారు గుర్తుకు వచ్చి ఊరేళ్లాలని పట్టుబట్టినా.. అనేక ప్రయత్నాలు చసి విఫలం కావడం.. ఇక తల్లిదండ్రులు కూడా అమెను స్వస్థలానికి చేరుకునే ప్రయత్నాలు లాక్ డౌన్ పూర్తయ్యే వరకు చేయవద్దని చెప్పడంతో.. ఒంటరి గదిలో చిక్కుకుపోయి.. మానసికంగా కలత చెందిన మనస్తాపానికి గురై.. విపరీత నిర్ణయాలు తీసుకుంటే.. ఎంతటి హృదయవిదారక ఘటన.
అలాంటి ఘటనే హైదరాబాద్ మహానగరంలోని లాకో హిల్స్ లో చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం మహానగరానికి ఇంటి పనులు చేసేందకు లాకో హిల్స్ లోని ఓ ఇంట్లో పనికి కుదిరింది ఓ యువతి.. కన్నవారిని ఉన్నఊరును విడిచి తొలిసారిగా వచ్చింది. అంతే వచ్చిరాగానే కొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా లాక్ డౌన్ విధించారు. దీంతో తాను పనిచేసే అపార్టుమెంటు నాలుగు గోడలే మహానగరమా.? అని భావించి.. ఇక లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటిసభ్యులందరూ ఇళ్లలోనే వుండటంతో పనిభారం కూడా ఎక్కువైంది.
దీంతో తన గ్రామానికి వెళ్లలేక, తల్లిదండ్రులు రాలేక.. ధైర్యంగా వుండాలని చెప్పారు. లాక్డౌన్ కారణంగా ఇంటికి వెళ్లలేకపోవటంతో గత కొద్దిరోజులుగా ముభావంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఊర్లో ఉన్న తల్లికి ఫోన్ చేసిన వల్లిక ‘‘అమ్మా! అక్క పిల్లలను చూడాలని ఉంది’’ అని అడిగింది. లాక్డౌన్ వల్ల ఇంటికి రావటానికి కుదరదని, గ్రామంలోకి బయటవారిని కూడా రానీయడం లేదని చెప్పడంతో మనస్తాపం చెందింది. ఉదయం పనికి వెళ్లిన తర్వాత ల్యాంకో హిల్స్ 15వ అంతస్తుపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది.
కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతానికి చెందిన వీర వల్లిక అనే యువతి, మూడు నెలల క్రితం హైదరాబాద్ కు వచ్చి, ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, ల్యాంకో హిల్స్ లో ఉంటోంది. లాక్ డౌన్ కారణంగా కార్యాలయం మూత పడటంతో ఇక్కడే చిక్కుకుపోయింది. ఆమె స్వగ్రామానికి వెళ్లే ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ సమయంలో తనను ఎలాగైనా తీసుకుని వెళ్లాలని తల్లిదండ్రులను కోరింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more