మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తొలిసారిగా ఎన్నికల బరిలో పోటీచేస్తునందున ఆయన తన ఆస్తులను ప్రకటించారు. శివసేన పార్టీ అధినేతగా కొనసాగుతున్నా.. ఆయన ఇప్పటి వరకు ఎన్నికల బరిలో దిగలేదు. ఈ సారి మూడు పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆయననే ముఖ్యమంత్రిగా అంగీకరించడంత ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు దిగాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యింది. దీంతో ఆయన మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. దీంతో ఆయన తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.
ఉద్దవ్ థాకరే సహా ఆయన సతీమణి పేరున ఉణ్న మొత్తం రూ.143.26 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో రూ.76.56 కోట్లు ఆయన పేరుపై, రూ.52.44 కోట్లు సతీమణి రష్మీ ఠాక్రే పేరు మీద ఉన్నట్లు తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పత్రాల్లో తెలిపిన వివరాల ప్రకారం.. ఆయనకు ఇప్పటి వరకు ఎలాంటి సొంత కారు లేదు. బ్యాంకు రుణాలతో కలిపి మొత్తం రూ.15.50 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇక ఆయనపై మొత్తం 23 కేసులు ఉన్నాయి. వీటిలో 14 కేసులు ఆయన శివసేన అధికారిక పత్రిక సామ్నాకు గీసిన కార్టూన్లు లేదా రాసిన వ్యాసాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నమోదైనవే.
ఉద్ధవ్ తన ఇద్దరు కుమారులు తనపై ఆధారపడుతున్నట్లు నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదు. దీంతో వారివురి ఆస్తులు, అప్పుల వివరాలు తెలపలేదు. సీఎంగా వేతనం, వడ్డీలు, డివిడెండ్లు, క్యాపిటల్ గెయిన్స్ ఉద్ధవ్ తన ఆదాయ వనరులుగా పేర్కొన్నారు. ఇక ఆయన భార్య రష్మీకి.. వడ్డీలు, అద్దె, కంపెనీ లాభాల్లో వాటా, డివిడెండ్, క్యాపిటల్ గెయిన్స్ నుంచి ఆదాయం సమకూరుతున్నట్లు తెలిపారు. ఇక ఆయన ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ వేశారు. ఎలాంటి పోటీ లేకపోవడంతో ఉద్ధవ్ ఎమ్మెల్సీగా ఎన్నికవడం లాంఛనమే అవనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more