విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి విడుదలైన రసాయన విషవాయువులతో 12 మంది మృతి చెందగా, వందలాది మంది ఆసుపత్రి పాలుకావడంతో.. ఆ సంస్థ వద్ద స్థానికులు అందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మృతుల కుటుంబాలకు తక్షణం న్యాయచేయాలని డిమాండ్ చేస్తూ వారి కుటుంబసభ్యులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అందోళన చేపట్టారు. అంతేకాదు జనవాసాల మధ్య నుంచి ఎల్జీ పాలీమర్స్ సంస్థను తక్షణం తరలించాలని ఆర్ఆర్ వెంకటాపూర్ గ్రామంతో పాటు ప్రభావిత ఐదు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలతో సంస్థ ఎదుటే ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్తులు తేల్చిచెబుతామన్నారు. రసాయన విషవాయువులు లీకేజీ కావడంతో తమ గ్రామస్థులు, గ్రామాలు నష్టపోతే.. నాయకులు వచ్చి పరిశ్రమలో పరిశీలిస్తున్నారని అరోపించారు. నాయకులు తమ గ్రామాల్లోకి వచ్చి బాధిత ప్రాంతాలను పరిశీలించడం లేదని అక్రోశం వ్యక్తం చేశారు. ఘటన జరిగి రెండు రోజులవుతున్నా ఇప్పటి వరకు కంపెనీ యాజమాన్యం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. తాగునీరు, ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధిత గ్రామస్థులు వాపోయారు. ప్రమాద ఘటనపై పరిశ్రమ యాజమాన్యం ప్రజలకు ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
స్థానికుల ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ గ్యాస్ లీకైన ప్రదేశాన్ని పరిశీలించేందుకు రావడంతో స్థానికులు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించడంత తీవ్ర ఉద్రిక్తత నెలకోంది. డీజీపీ వచ్చేందుకు గేటు తెరవడంతో స్థానికులు ఒక్కసారిగా పరిశ్రమలోకి దూసుకెళ్లారు. గేట్లు మూసివేసి పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఆందోళనకారులు లెక్కచేయకుండా పరిశ్రమలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో కొందరు మహిళలు డీజీపీ కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు వలయంగా ఏర్పడి డీజీపీకి రక్షణ కల్పించారు.
ఆందోళనకారులు పరిశ్రమలోకి చొచ్చుకురావడంతో డీజీపీ వాహనం దిగి నడుచుకుంటూ వెళ్లారు. గ్యాస్ లీకైన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం పోలీసులు అతికష్టం మీద డీజీపీని అక్కడినుంచి పంపించారు. మరో వైపు డీజీపీని అడ్డుకునేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఎల్జీ పాలిమర్స్ ను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ పరిశ్రమ వద్ద ఆందోళన కొనసాగుతోంది. సంయమనం పాటించాలని స్థానికులకు పోలీసులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా వారు శాంతించలేదు. పరిశ్రమ పరిసరాల్లో పరిస్థితిని నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా పర్యవేక్షిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more