మూడో విడత లాక్ డౌన్ నేపథ్యంలో పలు సడలింపులు అందుబాటులోకి రావడంతో పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలు మాత్రమే రాష్ట్రంలోకి రావాలని మిగిలిన వారెవరికీ రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతి లేదని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు పొరుగు రాష్ట్రాలలో వున్నవారు రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చి ఇబ్బందులు పడొద్దని పేర్కొంది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం కేవలం వలస కూలీలకు మాత్రమే సొంత ప్రాంతాలకు వచ్చేందుకు అనుమతి ఉందని, మిగతావారెవరికీ ఎలాంటి అనుమతి లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో మిగతా రాష్ట్రాల వారందరికీ లాక్ డౌన్ నిబంధనలు అమలు కానున్నాయని తెలిపింది.
ఇక రాష్ట్రానికి వచ్చిన వలస కూలీలదరినీ కేంద్రం జారీ చేసిన మార్గదర్శకత్వాల నేపథ్యంలో ముందుగా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నామని వివరించింది. దీంతో పాటు వారికి కరోనా నిర్థారణ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని వివరించింది. ఈ నేపథ్యంలో పోరుగు రాష్ట్రాల్లో వున్న సాధారణ ప్రజల సరిహద్దుల వద్దకు చేరుకుని ఇబ్బందులు పడవద్దని సూచించిన రాష్ట్రప్రభుత్వ అధికారులు.. ఇక వలస కూలీల సదుపాయాల కల్పన కష్టమవుతోందని.. అందుకే మిగతావారు సహకరించాలని కోరింది.
కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి పరిస్థితులను సమీక్షించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా దృష్ట్యా ఎక్కడివారు అక్కడే ఉండటం క్షేమకరమని.. అనవసర ప్రయాణాల వల్ల వైరస్ వ్యాప్తిచెందే ప్రమాదముందని కూడా హెచ్చరించారు. పెద్దవాళ్లతో పాటు డైయాబెటిక్, హైపర్ టెన్షన్ రోగుల ఆరోగ్యంపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న కరోనా నియంత్రణ చర్యలకు ప్రజల సహకారం అందించాలని ఆయన కోరారు. ప్రభుత్వ సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలి’ అని జగన్ పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more