ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. కరోనా వ్యాప్తి రాష్ట్రంలోకి వస్తున్న సందర్భంతో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు, కఠిన చర్యలు లాక్ డౌన్ విధించిన తరువాత కనుమరుగు అవుతున్నాయా.? అన్నట్లుగా లాక్ డౌన్ కోనసాగుతున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు, లాక్ డౌన్ అమల్లో వుండగా, కరోనా వ్యప్తి గత వారం రోజులుగా వేగంగా ప్రబలుతుండటం రాష్ట్రవాసులను తీవ్ర అందోళనకు గురిచేస్తోంది, అయితే మరణాలు మాత్రం గత నాలుగు రోజులుగా సంభవించకపోవడం కాస్తా ఊరటనిచ్చే అంశంగా మారింది. రాష్ట్రంలోని గ్రీన్ జోన్ ప్రాంతాలు కూడా ప్రభావితం చేస్తూ వ్యాప్తిచెందుతున్న కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంటోంది.
ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ తబ్లీగి జామాత్ ప్రార్థనల లింకులు బయటపడిన తరువాత విసృతంగా వ్యాప్తి చెందుతూ క్రమంగా రాష్ట్రంలో తన ప్రభావం వేగంగా చూపుతుంది. ఆ మధ్యకాలంలో కాసింత తగ్గినట్టు గణంకాలు స్పష్టం చేసినా.. రాష్ట్రంలో మళ్లీ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఏకంగా 3 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి, మంగళవారం ఉదయం పదకొండు గంటల నుంచి ఇవాళ ఉదయం పదకొండు గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 1332కి చేరింది.
ఇక రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ వుండటం ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో తాజాగా మరణాలు నమోదు చేసుకోనప్పటికీ.. పోరుగు రాష్ట్రాలతో పోల్చితు 31 మరణాలు సంభించడం కలవరానికి గురిచేస్తోంది. ఇక ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 287 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరులో 29, కృష్ణాలో 14, కర్నూలులో 11, కడపలో నాలుగు, అనంతపురంలో నాలుగు, చిత్తూరులో 3, తూర్పు గోదావరిలో 1, ప్రకాశంలో నాలుగు, పశ్చిమ గోదావరిలో రెండు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కటి చోప్పునా నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 1014 మంది చికిత్స పొందుతున్నారు.
జిల్లాల వారీగా ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలు ఇలా వున్నాయి,. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 343 కేసులు నమోదు కాగా, 9 మరణాలు సంభవించాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాల్లో 283 కేసులు ఎనమిది మరణాలు నమోదుకాగా, కృష్ణా జిల్లాలో 236 పాజిటివ్ కేసులు, ఎనమిది మరణాలు సంభవించాయి. నెల్లూరు-82 కేసులు రెండు మరణాలు, ప్రకాశం- 60, పశ్చిమగోదావరి-56, చిత్తూరు-77, విశాఖపట్నం-23, కడప జిల్లాలో 69 కేసులు, అనంతపురం-58 కేసులు నాలుగు మరణాలు సంభవించాయి. తూర్పుగోదావరి జిల్లాలో 40 కేసులు, ఇక తాజాగా శ్రీకాకుళంలో అత్యల్పంగా ఐదు కేసులు నమోదయ్యాయి, ఇక విజయనగరం జిలాలో ఇప్పటికీ ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more