73 new Covid-19 cases reported in AP ఏపీలో కరోనా విజృంభన.. 24 గంటల్లో 73 కేసులు

Ap records 73 new covid 19 cases in the last 24 hours taking the overall tally to 1 332

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates,

Andhra Pradesh reported 73 new Coronavirus positive cases, with this, the number of positive cases as of positive cases as of Wednesday morning reaches 1332. In all, 287 persons completed treatment and were discharged from hospitals.

ఆంధ్రప్రదేశ్ లో వేగంగా వ్యాపిస్తున్న కరోనావైరస్.. 24 గంటల్లో 73 కేసులు

Posted: 04/29/2020 10:48 AM IST
Ap records 73 new covid 19 cases in the last 24 hours taking the overall tally to 1 332

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. కరోనా వ్యాప్తి రాష్ట్రంలోకి వస్తున్న సందర్భంతో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు, కఠిన చర్యలు లాక్ డౌన్ విధించిన తరువాత కనుమరుగు అవుతున్నాయా.? అన్నట్లుగా లాక్ డౌన్ కోనసాగుతున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు, లాక్ డౌన్ అమల్లో వుండగా, కరోనా వ్యప్తి గత వారం రోజులుగా వేగంగా ప్రబలుతుండటం రాష్ట్రవాసులను తీవ్ర అందోళనకు గురిచేస్తోంది, అయితే మరణాలు మాత్రం గత నాలుగు రోజులుగా సంభవించకపోవడం కాస్తా ఊరటనిచ్చే అంశంగా మారింది. రాష్ట్రంలోని గ్రీన్ జోన్ ప్రాంతాలు కూడా ప్రభావితం చేస్తూ వ్యాప్తిచెందుతున్న కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంటోంది.

ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ తబ్లీగి జామాత్ ప్రార్థనల లింకులు బయటపడిన తరువాత విసృతంగా వ్యాప్తి చెందుతూ క్రమంగా రాష్ట్రంలో తన ప్రభావం వేగంగా చూపుతుంది. ఆ మధ్యకాలంలో కాసింత తగ్గినట్టు గణంకాలు స్పష్టం చేసినా.. రాష్ట్రంలో మళ్లీ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఏకంగా 3 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి, మంగళవారం ఉదయం పదకొండు గంటల నుంచి ఇవాళ ఉదయం పదకొండు గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 1332కి చేరింది.

ఇక రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ వుండటం ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో తాజాగా మరణాలు నమోదు చేసుకోనప్పటికీ.. పోరుగు రాష్ట్రాలతో పోల్చితు 31 మరణాలు సంభించడం కలవరానికి గురిచేస్తోంది. ఇక ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 287 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరులో 29, కృష్ణాలో 14, కర్నూలులో 11, కడపలో నాలుగు, అనంతపురంలో నాలుగు, చిత్తూరులో 3, తూర్పు గోదావరిలో 1, ప్రకాశంలో నాలుగు, పశ్చిమ గోదావరిలో రెండు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కటి చోప్పునా నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 1014 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలు ఇలా వున్నాయి,. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 343 కేసులు నమోదు కాగా, 9 మరణాలు సంభవించాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాల్లో 283 కేసులు ఎనమిది మరణాలు నమోదుకాగా, కృష్ణా జిల్లాలో 236 పాజిటివ్ కేసులు, ఎనమిది మరణాలు సంభవించాయి. నెల్లూరు-82 కేసులు రెండు మరణాలు, ప్రకాశం- 60, పశ్చిమగోదావరి-56, చిత్తూరు-77,  విశాఖపట్నం-23, కడప జిల్లాలో 69 కేసులు, అనంతపురం-58 కేసులు నాలుగు మరణాలు సంభవించాయి. తూర్పుగోదావరి జిల్లాలో 40 కేసులు, ఇక తాజాగా శ్రీకాకుళంలో అత్యల్పంగా ఐదు కేసులు నమోదయ్యాయి, ఇక విజయనగరం జిలాలో ఇప్పటికీ ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles