ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. కాసింత నెమ్మదించిందని బావిస్తున్న తరుణంలో మళ్లీ ఈ మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ ఘటన వెలుగుచూసిన తరువాత రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. తాజాగా నిన్న ఉదయం నుంచి ఇవాళ్టి ఉదయం వరకు రాష్ట్రంలో కొత్తగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 722 కి చేరుకుంది.
క్రితం రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇవాళ ఉదయం తొమ్మిద గంటల వరకు కొత్తగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 722కి చేరింది. ఇక రాష్ట్రంలో నిన్నటివరకు 15గా నమోదైన మరణాల సంఖ్య కూడా తాజాగా 5 మరణాలు సంభవించాయి. వీటితో 20కి చేరుకుంది ఇక ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 92 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు.
ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 25, గుంటూరు జిల్లాలో 20, కర్నూలు జిల్లాలో 16, కృష్ణా జిల్లాలో ఐదు, అనంతపురం నాలుగు, కడప 3, తూర్పుదోగావరి జిల్లాలో 2 నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 722కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 610 మంది చికిత్స పొందుతున్నారు. కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్లలో ప్రత్యేకంగా కుటుంబ సర్వే నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇక తాజాగా నమోదైన మరో ఐదు మరణాలతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య కూడా 20కు చేరింది.
జిల్లాల వారీగా ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలు ఇలా వున్నాయి,. గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా 149 కేసులు నమోదు కాగా, నలుగురు మృతిచెందారు. ఆ తరువాత కర్నూలు జిల్లాలో 174 కేసులు నమోదు కాగా ఐదుగురు మృతిచెందారు. నెల్లూరు-67 కేసులు రెండు మరణాలు, కృష్ణా-80 కేసులు, ఆరు మరణాలు నమోదయ్యాయి, ప్రకాశం - 44, పశ్చిమగోదావరి-35, చిత్తూరు-53, విశాఖపట్నం-23, అనంతపురం-33 కేసులు మూడు మరణాలు సంభవించాయి.
ఇక తూర్పుగోదావరి జిల్లాలో అత్యల్పంగా -26 కేసులు నమోదయ్యాయి, ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికీ ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. విశాఖపట్నంలో ఆరుగురు, కృష్ణా జిల్లాల్లో నలుగురు, తూర్పు గోదావరి 3, చిత్తూరులో ఒకరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఒకొక్కరు చోప్పున కరోనా వ్యాధి బారిన పడి కొలుకున్నారు. కాగా ప్రస్తుతం 610 మంది కరోనా పాజిటివ్ నేపథ్యంలో చికిత్స పోందుతున్నారని వైద్యాధికారులు తెలిపారు. కాగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను రోడ్ జోన్లుగా ప్రకటించారు అధికారులు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more