75 new Covid-19 cases reported in AP ఏపీలో పెరిగిన కరోనా విజృంభన.. 24 గంటల్లో 75 కేసులు

Coronavirus positive cases tally reaches 722 in andhra pradesh

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates,

Andhra Pradesh reported 75 new Coronavirus positive cases, with this, the number of positive cases as of positive cases as of Monday morning stand at 722 and deaths recorded in state at Fourteen. In all, 92 persons completed treatment and were discharged from hospitals.

ఏపీలో పెరిగిన కరోనా విజృంభన.. 24 గంటల్లో 75 కేసులు

Posted: 04/20/2020 03:17 PM IST
Coronavirus positive cases tally reaches 722 in andhra pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. కాసింత నెమ్మదించిందని బావిస్తున్న తరుణంలో మళ్లీ ఈ మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ ఘటన వెలుగుచూసిన తరువాత రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. తాజాగా నిన్న ఉదయం నుంచి ఇవాళ్టి ఉదయం వరకు రాష్ట్రంలో కొత్తగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 722 కి చేరుకుంది.

క్రితం రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇవాళ ఉదయం తొమ్మిద గంటల వరకు కొత్తగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 722కి చేరింది. ఇక రాష్ట్రంలో నిన్నటివరకు 15గా నమోదైన మరణాల సంఖ్య కూడా తాజాగా 5 మరణాలు సంభవించాయి. వీటితో 20కి చేరుకుంది ఇక ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 92 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు.

ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 25, గుంటూరు జిల్లాలో 20, కర్నూలు జిల్లాలో 16, కృష్ణా జిల్లాలో ఐదు, అనంతపురం నాలుగు, కడప 3, తూర్పుదోగావరి జిల్లాలో 2 నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 722కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 610 మంది చికిత్స పొందుతున్నారు. కంటైన్మెంట్‌ జోన్లు, రెడ్‌ జోన్లలో ప్రత్యేకంగా కుటుంబ సర్వే నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇక తాజాగా నమోదైన మరో ఐదు మరణాలతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య కూడా 20కు చేరింది.

జిల్లాల వారీగా ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలు ఇలా వున్నాయి,. గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా 149 కేసులు నమోదు కాగా, నలుగురు మృతిచెందారు. ఆ తరువాత కర్నూలు జిల్లాలో 174 కేసులు నమోదు కాగా ఐదుగురు మృతిచెందారు. నెల్లూరు-67 కేసులు రెండు మరణాలు, కృష్ణా-80 కేసులు, ఆరు మరణాలు నమోదయ్యాయి, ప్రకాశం - 44, పశ్చిమగోదావరి-35, చిత్తూరు-53,  విశాఖపట్నం-23, అనంతపురం-33 కేసులు మూడు మరణాలు సంభవించాయి.

ఇక తూర్పుగోదావరి జిల్లాలో అత్యల్పంగా -26 కేసులు నమోదయ్యాయి, ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికీ ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. విశాఖపట్నంలో ఆరుగురు, కృష్ణా జిల్లాల్లో నలుగురు, తూర్పు గోదావరి 3, చిత్తూరులో ఒకరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఒకొక్కరు చోప్పున కరోనా వ్యాధి బారిన పడి కొలుకున్నారు. కాగా ప్రస్తుతం 610 మంది కరోనా పాజిటివ్ నేపథ్యంలో చికిత్స పోందుతున్నారని వైద్యాధికారులు తెలిపారు. కాగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను రోడ్ జోన్లుగా ప్రకటించారు అధికారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles