అగ్రరాజ్యంలో మృత్యు ఘంటికలు మ్రోగుతున్నాయి. కరోనావైరస్ విజృంభనతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే అగ్రరాజ్యంలోని లక్షలాధి మంది దీని బారిన పడి చికిత్స పోందుతుండగా, దీని బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య ఏకంగా 32 వేలు దాటింది. గత కొన్నాళ్లలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన మరణాలు అత్యధికంగా 4491గా సంభవించాయి. ఇక వైరస్ సోకిన వారి సంఖ్య అగ్రరాజ్యంలో ఆరున్నర లక్షల మార్కు దాటింది. దీంతో అక్కడి వారిలో ఈ మరణాలు తీవ్ర అందోళనను రేకెత్తిస్తు్నాయి. ఒకే రోజులో నాలుగ వేల ఐదు వందల చేరువలో కరోనా వైరస్ మరణాలు సంభవించాయని జాన్స్ హాష్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.
అమెరికాలో మొత్తం 32,917 మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో ఏకంగా 4,491 మంది మృతి చెందారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. ఇక ఒక రోజులో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం అమెరికాలో ఇదే తొలిసారి. ఇందులో గతంలో చేర్చని కోవిడ్-19కు సంబంధించిన సంభావ్య మరణాలు కూడా ఉన్నాయి. కాగా, మొత్తం మరణాల్లో 3,778 సంభావ్య మరణాలను చేర్చినట్టు న్యూయార్క్ నగరం ప్రకటించింది. గురువారం రాత్రి నాటికి ‘యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ 31,071 మరణాలను నమోదు చేసింది. ఇందులో 4,141 సంభావ్య మరణాలు ఉన్నాయి.
ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు అగ్రరాజ్యం అమెరికాలోనే నమోదు అవుతున్నాయి. శాస్త్ర, సాంకేతిక పరంగా, వైద్య అరోగ్యరంగంలో విప్లవాత్మక అభివృద్ది సాధించిన అమెరికాలో మరణాలు నమోదు కావడం అందోళనకరంగా వుంది. ఆ తర్వాతి స్థానంలో ఇటలీ ఉంది. అక్కడ ఇప్పటి వరకు 22,170 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్లో 19,130 మంది, ఫ్రాన్స్లో 17,920 మంది మరణించారు. అమెరికాలో మొత్తంగా 6,67,800 కరోనా కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజులుగా ఇక్కడ రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. ఎపిక్ సెంటర్గా మారిన న్యూయార్క్లోనే 12 వేల మందికిపైగా మృతి చెందారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more