తెలంగాణ రాష్ట్రోన్నత న్యాయస్థానం అదేశాల మేరకు ఇంటర్ బోర్డు ఎట్టకేలకు గుర్తింపులేని జానియర్ కళాశాలపై కొరడా ఝుళిపించింది. నిబంధనలు పాటించని జూనియర్ కాలేజీలపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారంటూ హైకోర్టు ఇప్పటికే పలుమార్లు ఇంటర్మీడియట్ బోర్డును ప్రశ్నించింది. ఈ క్రమంలో పలు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు మేరకు అనుమతులు లేని, నిబంధనలు పాటించని, గుర్తింపులు లేని 68 జూనియర్ కాలేజీల గుర్తింపు రద్దు చేసింది. ఇందులో నారాయణ, శ్రీచైతన్య కాలేజీలు ఉన్నాయి.
దీంతో రాష్ట్రంలోని పలు జూనియర్ కాలేజీల గుర్తింపు రద్దు చేస్తున్నట్లు ఆయా కాలేజీల యాజమాన్యాలకు ఇంటర్బోర్డు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించింది. తెలంగాణలో జూనియర్ కాలేజీలపై చర్యలకు ఇంటర్ బోర్డు రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాలతో కార్పొరేట్ కాలేజీలపై చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర వ్యాప్తంగా 68 కాలేజీల గుర్తింపు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో 26 నారాయణ కాలేజీలు ఉండగా... ఇక మరో కార్పొరేట్ కాలేజీ శ్రీచైతన్యవి 18 కళాశాలలు ఉన్నాయి. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది.
అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్ జక్షన్ సర్టిఫికేట్లను తీసుకోకుండానే కాలేజీలను నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. వాస్తవానికి గతంలో కార్పొరేట్ కాలేజీలైన శ్రీచైతన్య, నారాయణలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాలని, నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త రాజేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు గత ఫిబ్రవరి 27న విచారణ చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 3లోపు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని సూచించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more