తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లి విజృంభిస్తోంది. రెండు రోజుల క్రితం రాత్రి నుంచి ఉదయం వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని తెలంగాణలో గత రెండు రోజులుగా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఇవాళ కొత్తగా మరో 66 కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 766కు చేరింది. గడిచిన 48 గంటల్లో 116 కేసులు నమోదవడం అందోళన రేగిస్తోంది, క్రితం రోజున నమోదైన 50 కేసుల్లో అన్ని హైదరాబాద్ మహానగరానికి చెందినవే కాగా, తాజాగా కూడా మరిన్న కేసులు హైదరాబాదులోనే నమోదయ్యాయి.,
ఈ రోజు నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 30 హైదరాబాదులోనే నమోదు కాగా, సూర్యపేట జిల్లాలో ఇవాళ తాజాగా మరో 15 కేసులు నమోదుకాగా, మిగతా వివిధ జిల్లాలో నమోదయ్యాయి. ఇక తాజాగా ఇప్పటి వరకు గ్రీప్ జోన్ గా వున్న మంచిర్యాలలో కూడా తొలి కరోనా కేసు ఇవాళ నమోదైనట్టు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణా రెడ్డి వెల్లడించారు. నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు పది కేసులు నమోదు కాగా, ఇవాళ ఉదయం తాజాగా మరో ఐదు కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కేసులు సంఖ్య 54కు చేరిందని అన్నారు.
ఇవాళ తాజాగాగా నమోదైన కేసులలో గద్వాల జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్టు డీఎంహెచ్ఓ శశికళ వెల్లడించారు. ఇక అదిలాబాద్ లో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కలెక్టర్ శ్రీదేవసేన వెల్లడించారు. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 14కు చేరిందన్నారు. కర్నూలు వైద్యుడి వద్ద చికిత్స పొందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయినట్టు తెలిపారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ రోజు 30 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిఫల్ కమీషనర్ లోకేశ్ కుమార్ వెల్లడించారు. వీరిని వెంటనే గాంధీ అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు, కరోనా సోకిన వారిని కదిసిన వ్యక్తులను కూడా వైద్య పరీక్షలు చేసినట్లు తెలిపారు.
కాగా, 766 మందిలో ఇప్పటి వరకు 133 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారని .. ఇక ఈ వ్యధి బారిన పడి చికిత్స పోందుతున్న వారి సంఖ్య ప్రస్తుతం 531గా వుంది. ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 18 మంది మహమ్మారి బారిన పడి అసువులు బాయగా, చికిత్స పొంది నయమైనవారి సంఖ్య కూడా తెలంగాణలో అధికంగానే వుంది. మొత్తంగా 133 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 766 కరోనా కేసులలో అధికంగా తెలంగాణ రాజధాని నగరం హైదరాబాదులోనే నమోదు కావడం గమనార్హం. నగరంలో ఏకంగా 293 కరోనా కేసులు నమోదయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more