దేశవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు దేశంలో పన్నెండు వేల మార్కు దాటి కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి దేశంలోనూ వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్ గత 24 గంటల్లో తొమ్మిద వందలకు పైగా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 941 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 37 మరణాలు సంభవించాయి, కొత్తగా నమోదైన కేసుల్లో అధిక కేసులు ఢిల్లీ, మహారాష్ట్రలోనే నిర్థారణ అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,380కి చేరిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ వైరస్ బారినపడి 414మంది ప్రాణాలు కోల్పోయారు.
మొత్తం బాధితుల్లో 1489మంది కోలుకోగా ప్రస్తుతం మరో 10.477మంది చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. అంతకంతకూ వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ బాధితుల్లో 76మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 170జిల్లాలను హాట్స్పాట్ ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించింది. వీటిలో తెలంగాణలో ఎనిమిది, ఆంధ్రప్రదేశ్లో 11జిల్లాలను హాట్స్పాట్ ప్రాంతాలుగా గుర్తించింది. దేశంలోని ఆరు మెట్రో నగరాలు కూడా హాట్స్పాట్ ప్రాంతాలుగా ఉన్నాయి. హాట్స్పాట్లుగా గుర్తించని ప్రాంతాల్లో ఏప్రిల్ 20నుంచి లాక్డౌన్ నిబంధనలకు సడలింపు ఇచ్చి
దేశంలో సంభవించిన కరోనా మరణాల్లో సగం మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత కలవరపెడుతోంది. తాజాగా రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య 187కి చేరింది. గడచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 229పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2916కి చేరింది. ముంబయిలో కొవిడ్-19 తీవ్రత ఆందోళనకరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత పెరిగింది. పాజిటివ్ కేసులు సంఖ్య 1578కి చేరింది. వీరిలో 32మంది మృత్యువాతపడ్డారు. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.
కంటైన్మెంట్ జోన్లలో ప్రజలను ఇళ్లనుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వాలు.. అక్కడి ప్రజలకు ఫోన్ నెంబర్ సహాయంతో వారికి కావాల్సిన సరుకులను ఇళ్ల వద్దకు చేరవేస్తున్నారు. ఇక రాజస్థాన్లో కొవిడ్-19 తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1023కి చేరగా ముగ్గురు మృత్యువాతపడ్డారు. మహారాష్ట్ర తర్వాత కరోనా వైరస్తో మరణించిన వారిసంఖ్య మధ్యప్రదేశ్, గుజరాత్లలో అధికంగా ఉంది. మధ్యప్రదేశ్లో ఇప్పటివరకు 987మందికి కరోనా నిర్ధారణ కాగా వీరిలో 53మంది ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో కేవలం ఒక్కరోజే కొత్తగా 257 కేసులు నిర్ధారణ అయ్యాయి. గుజరాత్లో 766 పాజిటివ్ కేసులు నమోదుకాగా 33మంది బలయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more