Coronavirus cases in India reaches 12000 mark death toll at 414 దేశంలో 414కు చేరిన కరోనా మరణాలు.. 12 వేలు దాటిన కేసులు

Coronavirus in india covid 19 cases in india crosses 12 000 mark death toll at 414

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

The total number of coronavirus cases in India today jumped over 12,000 after nearly 941 new infections were reported in past 24 hours, according to the latest data from Health Ministry. The death toll has gone up to 414 while 1306 have recovered, showed the latest data.

దేశంలో 414కు చేరిన కరోనా మరణాలు.. 12 వేల మార్క్ దాటిన కేసులు

Posted: 04/16/2020 10:34 AM IST
Coronavirus in india covid 19 cases in india crosses 12 000 mark death toll at 414

దేశవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు దేశంలో పన్నెండు వేల మార్కు దాటి కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి దేశంలోనూ వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్ గత 24 గంటల్లో తొమ్మిద వందలకు పైగా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 941 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 37 మరణాలు సంభవించాయి, కొత్తగా నమోదైన కేసుల్లో అధిక కేసులు ఢిల్లీ, మహారాష్ట్రలోనే నిర్థారణ అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,380కి చేరిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ వైరస్ బారినపడి 414మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం బాధితుల్లో 1489మంది కోలుకోగా ప్రస్తుతం మరో 10.477మంది చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. అంతకంతకూ వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ బాధితుల్లో 76మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 170జిల్లాలను హాట్‌స్పాట్‌ ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించింది.  వీటిలో తెలంగాణలో ఎనిమిది, ఆంధ్రప్రదేశ్‌లో 11జిల్లాలను హాట్‌స్పాట్‌ ప్రాంతాలుగా గుర్తించింది. దేశంలోని ఆరు మెట్రో నగరాలు కూడా హాట్‌స్పాట్‌ ప్రాంతాలుగా ఉన్నాయి. హాట్‌స్పాట్‌లుగా గుర్తించని ప్రాంతాల్లో ఏప్రిల్‌ 20నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలకు సడలింపు ఇచ్చి

దేశంలో సంభవించిన కరోనా మరణాల్లో సగం మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత కలవరపెడుతోంది. తాజాగా రాష్ట్రంలో కొవిడ్‌ మృతుల సంఖ్య 187కి చేరింది. గడచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 229పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2916కి చేరింది. ముంబయిలో కొవిడ్‌-19 తీవ్రత ఆందోళనకరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత పెరిగింది. పాజిటివ్‌ కేసులు సంఖ్య 1578కి చేరింది. వీరిలో 32మంది మృత్యువాతపడ్డారు. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు.

కంటైన్మెంట్ జోన్లలో ప్రజలను ఇళ్లనుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వాలు.. అక్కడి ప్రజలకు ఫోన్ నెంబర్ సహాయంతో వారికి కావాల్సిన సరుకులను ఇళ్ల వద్దకు చేరవేస్తున్నారు. ఇక రాజస్థాన్‌లో కొవిడ్‌-19 తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1023కి చేరగా ముగ్గురు మృత్యువాతపడ్డారు. మహారాష్ట్ర తర్వాత కరోనా వైరస్‌తో మరణించిన వారిసంఖ్య మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లలో అధికంగా ఉంది. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 987మందికి కరోనా నిర్ధారణ కాగా వీరిలో 53మంది ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో కేవలం ఒక్కరోజే కొత్తగా 257 కేసులు నిర్ధారణ అయ్యాయి. గుజరాత్‌లో 766 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 33మంది బలయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles