Coronavirus cases in India reaches 11,439 death toll at 377 దేశంలో 377కు చేరిన కరోనా మరణాలు.. 11,439 పాజిటివ్ కేసులు

Coronavirus in india covid 19 cases in india reaches 11 439 death toll at 377

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

The total number of coronavirus cases in India today jumped to 11,439 after nearly 1076 new infections were reported in past 24 hours, according to the latest data from Health Ministry. The death toll has gone up to 377 while 1306 have recovered, showed the latest data.

దేశంలో 377కు చేరిన కరోనా మరణాలు.. 11,439 పాజిటివ్ కేసులు

Posted: 04/15/2020 10:45 AM IST
Coronavirus in india covid 19 cases in india reaches 11 439 death toll at 377

దేశవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు దేశంలో పదకొండు వేల కరోనా వైరస్ కేసుల సంఖ్య 11వేల మార్కు దాటింది. దేశంలోనూ వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్ గత 24 గంటల్లో వెయి మందికి పైగా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 1076 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అధిక కేసులు ఢిల్లీ, మహారాష్ట్రలోనే నిర్థారణ అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 11,439కి చేరిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ వైరస్ బారినపడి 377మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం బాధితుల్లో 1306మంది కోలుకోగా ప్రస్తుతం మరో 9756మంది చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. దేశంలో ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చేందుతున్న తరుణంలో ప్రధాని ఇప్పటికే వచ్చే నెల 3వ తేదీ వరకు పోడగించారు. అంతకంతకూ వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారిని ఇప్పటికే దేశవ్యాప్తంగా 11,439 మందిని కబళించి వేసింది. ఇక దీని బారిన పడి అసువులు బాసిన వారి సంఖ్య 377కు చేరింది. ఇక ఈ వ్యాధి బారిన పడి కొలుకుంటున్న వారి సంఖ్య 9756కు చేరుకుంది.

దేశంలో సంభవించిన కరోనా మరణాల్లో సగం మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. తాజాగా రాష్ట్రంలో కొవిడ్‌ మృతుల సంఖ్య 178కి చేరింది. గడచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 353పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2687కి చేరింది. దేశఆర్థిక రాజధాని ముంబయిలో కొవిడ్‌-19 తీవ్రత ఆందోళనకరంగా ఉంది. హజ్రత్ నిజాముద్దీన్‌ ఘటన అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కేవలం ఒక్కరోజే 356 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడంతో ఢిల్లీలో కేసుల సంఖ్య 1561కి చేరింది. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి ప్రజలను ఇళ్లనుంచి బయటకురాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

మహారాష్ట్ర అనంతరం కరోనా వైరస్‌తో మరణించే వారిసంఖ్య మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లలో అధికంగా ఉంది. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 730మందికి కరోనా నిర్ధారణ కాగా వీరిలో 50 మంది ప్రాణాలు విడిచారు. గుజరాత్‌లో 650పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 28మంది ఈ వైరస్‌కు బలయ్యారు. ఇక రాజస్థాన్‌లో కొవిడ్‌-19 తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 969కి చేరగా ముగ్గురు మృత్యువాతపడ్డారు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 730మందికి కరోనా నిర్ధారణ కాగా వీరిలో 50మంది ప్రాణాలు విడిచారు. గుజరాత్‌లో 650పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 28మంది ఈ వైరస్‌కు బలయ్యారు. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి ప్రజలను ఇళ్లనుంచి బయటకురాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక తమిళనాడులోనూ కొవిడ్‌-19 తీవ్రత కొనసాగుతోంది. మర్కజ్‌ సమావేశం అనంతరం రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీస్థాయిలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1204కి చేరగా 12మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్ర అనంతరం కరోనా వైరస్‌తో మరణించే వారిసంఖ్య మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లలో అధికంగా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles