Coronavirus: US reports 2,108 deaths in 24 hours కరోనా కరాళ నృత్యం: అగ్రరాజ్యంలో అల్లకల్లోలం..

Us marks record 2 108 coronavirus deaths in 24 hours johns hopkins data

corornavirus, covid -19, coronavirus United States, America coronavirus, country with most coronavirus cases ,China, Johns Hopkins University ,US coronavirus cases ,Donald Trump,covid-19 pandemic,Italy,America, masks, coronavirus masks, New york, covid masks, which mask to use,, New york coronavirus, spain coronavirus Karnataka, coronavirus news, coronavirus hyderabad, coronavirus in tamil nadu, coronavirus cases, coronavirus live update india, coronavirus in india, coronavirus in india latest news

The US has become the world's first country to have registered more than 2,000 Covid-19 deaths in a single day with 2,108 fatalities reported in the past 24 hours, while the number of infections in America has crossed 500,000, the highest in the world, according to Johns Hopkins University data.

కరోనా కరాళ నృత్యం: అగ్రరాజ్యంలో అల్లకల్లోలం..

Posted: 04/13/2020 07:42 PM IST
Us marks record 2 108 coronavirus deaths in 24 hours johns hopkins data

అగ్రరాజ్యం ఇప్పుడు వణికిపోతోంది. ఎదో శత్రుదేశంతో కాదు..కరోనా రాకాసితో. వేలాది మంది చనిపోతున్నారు. ఒక్క రోజులోనే రెండు వేల మంది చనిపోతుండడంతో అక్కడ ఎలాంటి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య అధికమౌతున్నాయి. ఇప్పటి వరకు 18 వేల 856 మంది చనిపోయారని అంచనా. ఒకే రోజులో రెండు వేలకు పైగా కరోనా వైరస్ మరణాలు సంభవించాయని జాన్స్ హాష్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు లక్షణాలకు చేరుకున్నట్లు అంచనా.

ప్రస్తుతం అమెరికాలో మరణాల సంఖ్య 20 వేలు దాటింది. కేవలం 24 గంటల్లోనే 2043 మంది చనిపోయారు. దీంతో  ఇటలీ, స్పెయిన్ ను మించిన విషాదం అమెరికాలో అలుముకొంది. మరోవైపు... కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్న పాజిటివ్ కేసులను చూడటానికి ఆస్పత్రులు చాలడం లేదు. చనిపోతున్నవారిని  పూడ్చడానికి సమాధి స్థలాలు సరిపోవడం లేదు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నడుమ..అమెరికన్లు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. అమెరికాలో సంభవించిన మరణాల్లో అత్యధికంగా న్యూయార్క్ లో సంభవించాయి. డెడ్ బాడీస్ తో ఆసుపత్రులు నిండిపోతున్నాయి.

కరోనా వైరస్ కారణంగా మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వెల్లడించారు కూడా. మరోవైపు ప్రజలను రక్షించుకొనేందుకు అమెరికా ప్రభుత్వం..పలు చర్యలు తీసుకొంటోంది. ట్రంప్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచంలో ఇటలీలో అత్యధికంగా మరణించారు. అమెరికాలో కరోనా కల్లోలానికి కేంద్ర బిందువుగా మారిన న్యూయార్క్ నగరం శవాల దిబ్బగా మారిపోయింది.

ఎన్ని కట్టడి చర్యలు చేపట్టినా కొత్త కేసుల సంఖ్య తగ్గడంలేదు. మరణాల రేటు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ఈ ఒక్క నగరంలోనే లక్షా 70వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా... ఇప్పటికే దాదాపు 8వేల మంది మృతి చెందారు. కేవలం 24 గంటల్లో 8 వందల మంది మృత్యువాత పడటం కలవర పెడుతోంది. మరోవైపు... మృతదేహాలను పూడ్చిపెట్టేందకు సమాధులు సరిపోకపోవడంతో సామూహిక ఖననం చేస్తున్నారు. వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారిని హ‌ర్ట్ ఐలాండ్‌కు తీసుకెళ్లి ఖ‌న‌నం చేస్తున్నారు.  

ఇక అటు ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణాల సంఖ్య లక్ష దాటింది. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ లెక్కల ప్రకారం, శుక్రవారం నాటికి 16 లక్షల మందికి పైగా బాధితులు ఉండగా, మృతుల సంఖ్య 1,00,000ను చేరింది. జనవరి 9న ఈ వైరస్ బారిన పడి, వూహాన్ లో తొలి మరణం సంభవించగా, 50 వేల మరణాలు నమోదు కావడానికి 83 రోజుల సమయం పట్టింది. ఆపై కేవలం 8 రోజుల వ్యవధిలోనే మరణాల సంఖ్య రెట్టింపై, లక్షను దాటేసింది. గడచిన వారం రోజులుగా రోజుకు 6 నుంచి 10 శాతం మేరకు మరణాలు నమోదవుతున్నాయని రాయిటర్స్ పేర్కొంది.

ఒక్క గురువారం రోజునే ప్రపంచ వ్యాప్తంగా 7,300 మంది వైరస్ కారణంగా మృత్యువాతపడ్డారని పేర్కొంది. 660 దశకంలో లండన్ ను తీవ్రంగా దెబ్బతీసిన ప్లేగు మహమ్మారితో ఈ మరణాలను పోల్చవచ్చని, ఆ సమయంలో నగరంలోని జనాభాలో మూడింట ఒక వంతు మంది (లక్ష మంది) మరణించారని గుర్తు చేసింది. ఆపై 1918 ప్రాంతంలో కనిపించిన స్పానిష్ ఫ్లూ ప్రపంచమంతా విస్తరించి, రెండేళ్ల పాటు మారణహోమం సృష్టించి, రెండు కోట్ల మంది ప్రాణాలను హరించింది. అయితే, ప్రస్తుతానికి కరోనాను స్పానిష్ ఫ్లూతో సమానంగా భావించలేమని వైద్య రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు.

చైనాలోని సీఫుడ్ మార్కెట్ నుంచి వ్యాపించిందని అంచనా వేస్తున్న కరోనా వైరస్, శరవేగంగా ప్రపంచమంతటికీ విస్తరించిన సంగతి తెలిసిందే. ఇక, శుక్రవారం విడుదలైన లక్ష మంది మృతులు, 16 లక్షల కేసుల గణాంకాలు వాస్తవ సమాచారం కాకపోవచ్చన్న ఊహాగానాలూ వెల్లువెత్తుతున్నాయి. చాలా మందిలో చాలా తక్కువ కరోనా లక్షణాలు, కొందరిలో ఎటువంటి లక్షణాలు కనిపించకున్నా, కరోనా పాజిటివ్ వస్తోందని, దీని ప్రకారం, అందుబాటులోని అధికారిక గణాంకాలతో పోలిస్తే, వాస్తవ గణాంకాలు తేడాగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఇటలీ, ఫ్రాన్స్, అల్జీరియా, నెదర్లాండ్స్, స్పెయిన్, బ్రిటన్ తదితర దేశాల్లో వ్యాధి సోకిన వారిలో 10 శాతానికి పైగా మరణాలు నమోదవుతూ ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో వైరస్ పుట్టిన చైనాలో మాత్రం మరణాల రేటు 2.9 శాతం మాత్రమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles