అక్రమ సంబంధాల మోజులో పడి తాళికట్టిన వారిని కడతేర్చుతున్న వారి సంఖ్య రానురాను పెరుగుతూ పోతోంది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో వెలుగుచూసిన ఇలాంటి ఘటనను మర్చిపోకముందే అలాంటిదే మరో ఘటనే ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. వావివరసలు మర్చిపోయి కొడుకు వయస్సు యువకుడితో అక్రమ సంబంధాలు పెట్టుకుని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంది. ఉత్తరాఖండ్ లోని, డెహ్రాడూన్, వికాస్ నగర్ లోని, జుడ్లి అడువాలా అనే గ్రామంలో భార్యా, ఇద్దరు పిల్లలతో కలిసి కాపురం ఉంటోంది ఒక వివాహితుడి కుటుంబం.
అతని భార్య పద్మ(42)కు అదే ఊళ్లో ఉంటున్న 20 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాలక్రమంలో వారిద్దరి మధ్య శారీరీక సంబంధానికి దారి తీసింది. అయితే ఈ యువకుడు రోహిత్ ఇంటికి వచ్చివెళుతూ ఉండేవాడు. ఆమె కంటే 22 ఏళ్ళ చిన్నవాడు కావటంతో ఎవరికీ వీరిపై అనుమానం కలగలేదు. ఈ అవకాశాన్ని వారిద్దరూ అనుకూలంగా మలుచుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పద్మ ఆ యువకుడిని ఇంటికి పిలుచుకుని అతడితో రాసలీలల్లో మునిగి తేలిపోయేది. చాలా కాలం పాటు గుట్టుగా వారిద్దరూ శృంగారాన్ని అనుభవించారు. తప్పుడు పనులు ఎక్కువ కాలం దాగి ఉండవన్నట్లు... కొంత కాలానికి వీరి వ్యవహారం భర్త రోహిత్ కు తెలిసిపోయింది.
పద్ధతిగా నడుచుకోమని భార్యను రోహిత్ హెచ్చరించాడు. దీంతో భర్తను తొలగించుకోవాలని అనుకుంది. ఈ విషయాన్ని తన ప్రియుడికి చెప్పింది. ఏప్రిల్ 4, శనివారం రాత్రి అందరూ ఇంట్లో నిద్రిస్తుండగా పద్మ ప్రియుడిని ఇంటికి పిలిచింది. అందరూ నిద్రలో ఉండగా ప్రియుడు పద్మ ఇంటిలోకి ప్రవేశించి.. రోహిత్ తలపై తుపాకీతో కాల్చి పారిపోయాడు. తెల్లవారి ఏమీ తెలియనట్లు నిద్రలేచి తన భర్తను ఎవరో కాల్చిచంపారని ఏడ్వటం మొదలెట్టింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్ధలానికి వచ్చి శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రోహిత్ ను తుపాకీతో కాల్చినా.. పక్కగదిలోనే పడుకున్న పద్మకు కనీసం మెలుకవ రాకపోవటం...ఆమెకు తెలియకపోవటంపై పోలీసులకు అనుమానం కలిగింది.
ఇదే అనుమానాన్ని రోహిత్ తండ్రి మెల్హార్ , ఇతర బంధువులు కూడా వ్యక్త పరిచారు. పోలీసులు పద్మను అదుపులోకి తీసుకుని విచారించగా ప్రియుడు సాయంతో నే భర్తను హత్యే చేసినట్లు నేరం ఒప్పుకుంది. వెంటనే పోలీసులు నేరం చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పద్మ ప్రియుడు కుడా నేరాన్ని అంగీకరించాడని హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని నిందితుడు పారెయ్యటంతో దాన్ని వెతికే పనిలో పోలీసులు ఉన్నట్లు ఎస్పీ దేహత్ పర్మీందర్ దోవల్ చెప్పారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more