కరోనా కట్టడిని చేసేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని అస్త్రాలను వినియోగిస్తున్నారు. ఓ వైపు వైద్యరంగంలోని నిపుణులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే.. మరో వైపు హిందూ సనాతన ధర్మాలను అనుసరించి ఈ విపత్కర పరిణామాలను ఎలా అధిగమించాలనే యోచనతో చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన దేశప్రజలకు మరో పిలుపునిచ్చారు. రానున్న ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల 9 సెకన్ల పాటు ఇంట్లో ఉన్న లైట్లు బంద్ చేసి.. కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు.
చీకటిలో దీపాల కాంతులలో కరోనా రాకాసిని ప్రారదోలాలని, ఇదే రామబాణం అని చెప్పారు. ఈ పోరాటాన్ని కొనసాగించాలని, యుద్ధంలో గెలవాలన్నారు. 130 మంది కోట్ల మంది అందరూ సంఘటితంగా ఉన్నామని చాటి చెప్పాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా రాకాసి కోరలు చాస్తోంది. భారతదేశాన్ని కూడా గడగడలాడిస్తోంది. ఈ క్రమంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంతకంటే ముందు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
మార్చి 24వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా మరోసారి ప్రజలనుద్దేశించి మాట్లాడుతానని మోడీ చెప్పడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చెప్పినట్లుగానే 2020, ఏప్రిల్ 03వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు జాతినుద్దేశించి వీడియో సందేశం ఇచ్చారు. ప్రతొక్కరూ ఇంట్లో ఉంటే కరోనాను జయించినట్లేనని, జనతా కర్ఫ్యూ, లాక్ డైన్ ద్వారా ప్రజలు సహకరించారని తెలిపారు. పరిస్థితులు ఎదుర్కోవడంలో సంఘటితంగా ఉండాలన్నారు. భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
ప్రపంచదేశాలు భారతదేశం బాటలోనే పయనిస్తోందని చెప్పారు. కరోనా మహమ్మారి ప్రారదోలేందుకు సహకరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నానన్నారు. లాక్ డౌన్ మరింత కఠినంగా పాటించాలని, ఏప్రిల్ 05వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు..లైట్లు బంద్ చేయాలని పిలుపునిచ్చారు. కొవ్వొత్తులు, దీపాలు, టార్చ్ లైట్లు, మొబైల్ ఫ్లాష్ లైట్స్ వెలిగించాలన్నారు. ఈ సంకట సమయంలో భారతీయులకు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుందని ప్రధాని మోడీ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more