కరోనా కట్టడిని చేసేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని అస్త్రాలను వినియోగిస్తున్నారు. ఓ వైపు వైద్యరంగంలోని నిపుణులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే.. మరో వైపు హిందూ సనాతన ధర్మాలను అనుసరించి ఈ విపత్కర పరిణామాలను ఎలా అధిగమించాలనే యోచనతో చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన దేశప్రజలకు మరో పిలుపునిచ్చారు. రానున్న ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల 9 సెకన్ల పాటు ఇంట్లో ఉన్న లైట్లు బంద్ చేసి.. కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు.
చీకటిలో దీపాల కాంతులలో కరోనా రాకాసిని ప్రారదోలాలని, ఇదే రామబాణం అని చెప్పారు. ఈ పోరాటాన్ని కొనసాగించాలని, యుద్ధంలో గెలవాలన్నారు. 130 మంది కోట్ల మంది అందరూ సంఘటితంగా ఉన్నామని చాటి చెప్పాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా రాకాసి కోరలు చాస్తోంది. భారతదేశాన్ని కూడా గడగడలాడిస్తోంది. ఈ క్రమంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంతకంటే ముందు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
మార్చి 24వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా మరోసారి ప్రజలనుద్దేశించి మాట్లాడుతానని మోడీ చెప్పడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చెప్పినట్లుగానే 2020, ఏప్రిల్ 03వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు జాతినుద్దేశించి వీడియో సందేశం ఇచ్చారు. ప్రతొక్కరూ ఇంట్లో ఉంటే కరోనాను జయించినట్లేనని, జనతా కర్ఫ్యూ, లాక్ డైన్ ద్వారా ప్రజలు సహకరించారని తెలిపారు. పరిస్థితులు ఎదుర్కోవడంలో సంఘటితంగా ఉండాలన్నారు. భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
ప్రపంచదేశాలు భారతదేశం బాటలోనే పయనిస్తోందని చెప్పారు. కరోనా మహమ్మారి ప్రారదోలేందుకు సహకరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నానన్నారు. లాక్ డౌన్ మరింత కఠినంగా పాటించాలని, ఏప్రిల్ 05వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు..లైట్లు బంద్ చేయాలని పిలుపునిచ్చారు. కొవ్వొత్తులు, దీపాలు, టార్చ్ లైట్లు, మొబైల్ ఫ్లాష్ లైట్స్ వెలిగించాలన్నారు. ఈ సంకట సమయంలో భారతీయులకు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుందని ప్రధాని మోడీ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more