ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి సుమారుగా 200 పైగా దేశాలపై తన ప్రభావాన్ని చాటింది. ఎక్కడో చైనాలోని వూహాన్ పట్టణంలో పుట్టుకోచ్చని ఈ మహమ్మారిని ఇప్పటివరకు దాదాపు 9లక్షల మందిని తన బారిన పడేసింది. ఇది అధికారిక సంఖ్యేకానీ.. వాస్తవ సంఖ్య మాత్రం ఇంతకు మించేవుంటుందని తెలుస్తోంది. కరోనా వైరస్ భారిపడి మరణించిన సంఖ్య కూడా ప్రపంచవ్యాప్తంగా 43వేలు దాటింది. అయితే రోజురోజుకీ విపరీతంగా పెరుగుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి.. క్రమంగా తన ప్రభావాన్ని కూడా కొల్పోతుందని తెలుస్తోంది.
కరోనా వైరస్ ప్రపంచ ప్రజానికాన్ని భయాందోళనకు గురిచేసినంతగా ప్రస్తుతం ప్రభావం చూపడం లేదని తాజగా అద్యయానాలు స్పష్టం చేస్తున్నాయి. ముందుగా అంచనా వేసిన స్ధాయిలో ప్రాణాలకు ముప్పు ఉండదని తాజా సర్వేలో వెల్లడైంది. భారత్ లో కూడా కరోనా కేసుల సంఖ్య 1600 దాటింది. మరణాల సంఖ్య కూడా 50దాటింది. తాజా గణంకాల ప్రకారం ఇవాళ ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 152కి చేరింది. గడిచిన 24గంట్లలోనే 32మందకి కరోనా వచ్చినట్లు నిర్థారణ అయింది. ఇక తమిళనాడులో ఇవాళ ఒక్కరోజే 110 కేసులు నమోదయ్యాయి.
అయితే ఇవాళ తమిళనాడు, ఢిల్లీ సహా పలురాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో 90శాతం వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైనవారే కావడం గమనార్హం. కాగా, కరోనా వైరస్ మరణాల రేటు ఇప్పటివరకూ వేసిన అంచనాల కంటే చాలా తక్కువగా ఉంటుందని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన తాజా అథ్యయనం తెలిపింది. చైనాలో కరోనా వైరస్ బారిన పడిన వారితో పాటు ఈ మహమ్మారికి కేంద్ర బిందువుగా మారిన వుహాన్లో రాకపోకలు సాగించిన వారిపై బ్రిటిష్ పరిశోధకులు ఈ అథ్యయనం చేపట్టారు.
చైనాలో కరోనా వైరస్ కేసులను సమగ్రంగా విశ్లేషించిన మీదట పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. కరోనా వైరస్ నిర్ధారణ అయిన, నిర్ధారణ కాని కేసులన్నింటిలో మరణాల రేటు కేవలం 0.66 శాతంగా ఈ అథ్యయనం గుర్తించింది. నిర్ధారణైన కరోనా కేసుల్లో మరణాల రేటు 1.38 శాతంగా పేర్కొంది. అయితే కరోనా వైరస్ నిర్ధారించిన కేసుల్లో మరణాల రేటును గతంలో అధికారులు 2 నుంచి 8 శాతం మధ్య ఉండవచ్చని అంచనా వేయడం గమనార్హం. ఇక మొత్తం కేసుల్లో మరణాల రేటును 0.2 నుంచి 1.6 శాతంగా అంచనా వేయగా తాజా సర్వేలో ఇది 1.38 శాతంగా వెల్లడైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more