ప్రపంచదేశాలను భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్.. మన దేశంలో కూడా ఊహించనంత వేగంగా విస్తరిస్తుంది. దీంతో ప్రజలను అప్రమత్తం చేస్తూనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలని కొరుతూ లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వేసవిలో ఇళ్లకు పరిమితమైన విద్యార్థులు ఇంట్లోనే ఇండోర్ గేమ్స్ అడుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ ఆ నిర్ణయం ఏంటనీ అంటున్నారు కదూ.. సీఎం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యార్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు రాయకుండానే.. పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 9వ తరగతి పిల్లలను పై తరగతులకు ప్రమోట్ చేయడం జరిగిందని అధికారులు వెల్లడించారు. 2020, మార్చి 26వ తేదీ గురువారం విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ కారణంగా పరీక్షల వాయిదా, పిల్లలకు మధ్యాహ్న భోజనం, తదితర విషయాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.
వైరస్ కారణంగా స్కూళ్లు మూతపడినందున పిల్లలకు నేరుగా వారి ఇళ్లకే మధ్యాహ్న భోజనం అందచేయాలని, వాలంటీర్ల సహాయంతో దీనిని అందచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అదే సమయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన విషయంలో ఒకే క్వాలిటీ మెయింటైన్ చేయాలని, సీఎం గోరుముద్ద కార్యక్రమాన్ని గర్వంగా తీసుకోవాలన్నారు. దీన్ని మరింత బలోపేతం చేయడానికి పూర్తి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అధికారులు పాల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more