విదేశాలాకు చెందినవారికే తప్ప ఇప్పటి వరకు తెలంగాణలో వుండే స్థానికుల దరి చేరని కరోనా వ్యాధి.. తొలిసారిగా తెలంగాణలో నివసించే వ్యక్తికి సోకడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చినవారిలో మాత్రమే పాజిటివ్ ఫలితాలు కనిపించడంతో ఊపిరిపీల్చుకున్న ప్రజానికం.. తొలిసారిగా రాష్ట్రంలో వ్యక్తికి కూడా సోకింది. దీంతో స్థానికులు తీవ్ర అందోళనకు గురవుతున్నారు. రెండో దశ ఎప్పుడో చేరామన్న వార్తలతో అందోళనకు గురవుతున్న ప్రజలు, ఈ పరిణామాలతో రెండో దశ దాటామా.? లేక చేరుకున్నామా.? అన్న సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
దుబాయ్ నుంచి వచ్చిన ఓ యువకుడి ద్వారా సదరు వ్యక్తికి కరోనా వైరస్ సంక్రమించినట్టు గుర్తించారు. రాష్ట్రంలో ఈ తరహాలో ఇదే మొదటి కేసు. దుబాయ్ నుంచి ఓ వ్యక్తి ఈ నెల 14న నగరానికి రాగా కరోనా లక్షణాల కారణంగా అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అతడికి కరోనా సోకినట్టు ఈ నెల 19న ప్రభుత్వం ప్రకటించింది. ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న మరో వ్యక్తికి తాజాగా కరోనా సోకినట్టు వైద్యపరీక్షల్లో వెల్లడైంది. దాంతో ఇప్పటివరకు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 21కి చేరినట్టయింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక బులెటిన్ విడుదల చేసింది.
ఇదిలావుండగా, క్వారంటైన్ కేంద్రం నుంచి తప్పించుకుని సొంత జిల్లా పశ్చిమ గోదావరికి వెళ్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో జరిగిందీ ఘటన. దుబాయ్ నుంచి ముంబై వచ్చిన యువకుడిని అక్కడి అధికారులు క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అయితే వైద్య సిబ్బంది బిజీగా వున్న సమయంలో ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న యువకుడు ఏకంగా హైదరాబాద్ చేరుకున్నాడు. అయితే రైలులో వచ్చాడా లేక అక్కడి నుంచి ప్రైవేటు బస్సులో వచ్చాడా.? అన్న విషయం అధికారులు తెలుసుకునే పనిలో వున్నారు.
హైదరాబాద్ నుంచి పశ్చిమ గోదావరిలోని సొంతూరు వెళ్లేందుకు ప్రైవేటు బస్సెక్కాడు. బస్సులో టికెట్ కొనుక్కుని ఎంచక్కా ఎక్కేశాడు. అయితే అతడ్ని క్వారంటైన్ చేసిన సమయంలో అధికారులు అతిని చేతిపై ముద్రను చూసిన తోటి ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. ఆ ముద్ర ఏంటని ఆరా తీయడంతో కంగారు పడిపోయాడు. అనుమానించిన ప్రయాణికులు అతడిని వెంటనే బస్సు నుంచి కిందికి దించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఎల్బీనగర్ పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more