ప్రపంచవ్యాప్తంగా కళారా నృత్యం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్.. మన దేశంలోనూ పంజా విసురుతోంది. ఇప్పటికే 167 మందిపై తన ప్రభావాన్ని చాటిన ఈ మహమ్మారి.. ఇప్పటికే ధేశంలోని ముగ్గురు వృద్దులను బలితీసుకుంది. ఇక తాజాగా మరో మరణం కూడా నమోదైంది. ఈ మరణం పంజాబ్ రాష్ట్రంలో నమోదు కావడం కలకలం రేపుతోంది. పంజాబ్ లో 72 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మరణించినట్టు ఆ రాష్ట్ర వైద్యాధికారులు నిర్ధారించారు. ఆయన ఇటీవలే ఇటలీ నుంచి వచ్చినట్టు తెలుసుకున్నారు.
కరోనావైరస్ సోకిన తొలి మరణం కర్ణాటకలో నమోదు కాగా, రెండవ మరణం న్యూఢిల్లీలో నమోదు అయ్యింది. ఇక మూడవ మరణం మహారాష్ట్రలో నమోదు కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేశాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు కరోనా నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించి విద్యాసంస్థలకు, సినిమా హాళ్లు, జనసామార్థ్యం అధికంగా వున్న ప్రాంతాల్లో జనం గుమ్మిగూడకుండా చర్యలు చేపట్టారు. దేశమొత్తమ్మీద ఇప్పటివరకు 167 కరోనా కేసులు నమోదైనట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నివేదికల ప్రకారం కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో 42 మంది కరోనా బాధితులను గుర్తించారు. ఆ తరువాత కేరళలలో 25 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఇక ఈ రెండు రాష్ట్రాల తరువాత ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా బాధితులు అధికంగా వున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం దేశరాజధానిలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ ను విధించారు. కాగా, ఏపీలో పాజిటివ్ కేసు ఒక్కటేనని నివేదికలో పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more