ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటినీ పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే క్రమంలో అనేక దేశాలు యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. అదేస్థాయిలో ఇటు భారత ప్రభుత్వం కూడా వ్యాధి ప్రబలకుండా పలు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో జనసాంధ్రత ఉన్న ప్రాంతాలల్లో 144 సెక్షన్ సహా అప్రకటిత కర్ప్యూ వాతావరణాన్ని తీసుకురావడంతో దేశంలో ఈ వ్యాధి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే తరుణంలో జనసాంధ్రత అధికంగా వుండే ఫుణ్యక్షేత్రాలలోనూ ఆంక్షలను విధిస్తున్నారు. ఈ క్రమంలో తిరుమలలోనూ టీటీడీ పాలకమండలి పలు ఆంక్షలను అములచేస్తోంది.
కరోనావైరస్ భయంతో తిరుమలకు భక్తుల రాక తగ్గింది. ఇదే సమయంలో ఎక్కడా వేచి చూడకుండా స్వామి దర్శనానికి టైమ్ స్లాట్ టోకెన్లను కేటాయించి మరీ పంపుతుండగా, క్యూలైన్లలో సైతం ఒకరిని ఒకరు తాకకుండా వెళుతున్నారు. భక్తుల రద్దీ తగ్గడంతో, మహా లఘుదర్శనం స్థానంలో, లఘు దర్శనాన్ని ఆలయంలో అమలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాల్లో ఈ పరిస్థితి నెలకొంది. తిరుమల తిరుపతితో పాటుగా నిత్యం భక్తులతో కిటకిటలాడే శ్రీకాళాహస్తి, కాణిపాకం దేవాలయాలు భక్తులు లేక వెలవెల బోతున్నాయి. కొద్ది మంది భక్తలు మాత్రమే వస్తున్నారు.
అన్నదానం, రాహుకేతులు పూజలు చేయించుకొనే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని అంటున్నారు ఆలయ అధికారులు. శని, ఆది, సోమవారాల్లో శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భారీగా భక్తులు వస్తుంటారు. కానీ ప్రస్తుతం అలాంటి సీన్ కనిపించడం లేదు. వచ్చిన కొద్దిమంది భక్తులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖానికి మాస్క్లు ధరించి వస్తున్నారు. ఇక ఇటు తెలంగాణలాలోనూ దైవదర్శనంపై కూడా కరోనా ప్రభావం పడిపోయింది. గుళ్లకు వెళ్లాలంటేనే.. భక్తులు వెనుకడుగు వేస్తున్నారు. ప్రముఖ దేవాలయాల్లో రద్దీ తగ్గిపోయింది. యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి, వేములవాడ రాజన, కొండగట్టు, సహా అన్ని ప్రముఖ దేవాలయాలకు భక్తుల తాకిడి గణనీయంగా తగ్గింది.
తెలంగాణలో వీసా దేవుడిగా ఖ్యాతిగడించిన చిలుకూరు బాలాజీ స్వామి ఆలయాన్ని ఇవాళ్టి నుంచి ఆలయ అధికారులు మూసివేస్తున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రాలతో పాటు భద్రాచలం, బాసర, ధర్మపురి, ఇతర ఆలయాలు బోసిపోతున్నాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రదేశాలను సందర్శించకుండా ఉండాలని అధికారులే స్వయంగా సూచనలిస్తున్నారు. ఇదివరకే మహారాష్ట్రలోని పలు దేవాలయాలను అక్కడి అధికారులు మూనివేశారు. షిరిడీలోని సాయిబాబా ఆలయం కూడా ట్రస్టు సభ్యులు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అటు అన్నవరంలోనూ రమాసహిత సత్యనారాయణ స్వామి సామూహిక వత్రాలను అధికారులు నిలిపివేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more