దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన దిశ హత్యాచార ఘటన నమోదు చేసుకున్న రంగారెడ్డి జిల్లాలో అలాంటి ఘటనే మరోకటి నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ‘దిశ` హత్యకేసులో అమె తండ్రి అర్థరాత్రి సమయంలోనే పోలీసులకు పిర్యాదు చేయడం.. ఉదయానికి అమె మృతదేహం లభ్యం కావడం.. టోల్ గేటు వద్ద వున్న సీసీటీవీ ఫూటేజీలు నిందితుల ఫూటేజీని బట్టబయలు చేయడంతో లారీ నెంబరు ఆధారంగా కేసును 24 గంటల్లో చేధించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం వెళ్లగా వారు తప్పించుకునేందుకు యత్నించడంతో వారిని ఎన్ కౌంటర్లో కాల్చివేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ దారుణ ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేసినా.. ఆదే జిల్లాలో మరో దిశ ఘటన నమోదు కావడం కలకలం రేపుతోంది. ఎన్ కౌంటర్లతో ఇలాంటి నేరాలకు పాల్పడాలంటేనే దడ పుట్టాల్సిన తరుణంలో.. అదే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో మరో దారుణం చోటు చేసుకోవడం పోలీసులకు సవాల్ విసిరేలావుంది. ఈ ఘటనలో కూడా మహిళను ఎక్కడో అత్యాచారం చేసి హత్యచేసిన తరువా ఇక్కడకు తీసుకువచ్చి పడేశారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 23 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సులో వుండే ఓ మహిళ మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు.
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండల పరిధిలోని తంగడపల్లి గ్రామశివారులో వంతెన కింద గుర్తు తెలియని మహిళ మృతదేహం వుందన్న స్థానికుల సమాచారం రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ శరీరంపై దుస్తులు లేకపోవడం, బండరాయితో తలపై మోది హత్య చేసిన ఆనవాళ్లు ఉండటంతో అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మహిళకు సంబంధించిన వస్తువులు, దుస్తులు గానీ ఘటనాస్థలంలో లభించకపోవడంతో ఆమె వివరాలను సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది.
20 నుంచి 30 సంత్సరాల వయస్సు ఉన్న మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. శరీరంపై అనేక గాయాలు ఉన్నాయి. మహిళ ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకపోవడం, వివస్రను చేసి తీసుకొచ్చిన వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చి పరారు అయినట్లు తెలుస్తోంది. క్లూస్ టీమ్స్ ఏర్పాటు చేశారు. డాగ్ స్క్వాడ్ టీమ్స్ ఘటనాస్థలికి చేరుకుని ఘటన ఏవిధంగా జరిగిందని పరిశీలిస్తున్నారు. చేవెళ్ల డీఎస్పీ రవీందర్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గురైన యువతి ఏ ప్రాంతానికి చెందిన మహిళ అనేది తెలిస్తే నిందితులను త్వరగా గుర్తించేందుకు అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more