ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కళారా నృత్యం చేస్తోంది. పశువుల్లో సంక్రమించే ఈ వ్యాధి.. క్రమంగా మనుషులను కూడా కబంధహస్తాల్లోకి తీసుకుంది. అతేకాదు వేగంగా విస్తరిస్తూ.. ప్రపంచాన్ని వణికించింది. ప్రపంచంలో ఇప్పటి వరకూ 157 దేశాలకు విస్తరించిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) అధికారికంగా నిర్ధారించింది. మొత్తం 1,69,531 మంది ఈ వ్యాధి బారిన పడ్డారని, వారిలో 6,515 మంది మరణించారని వెల్లడించింది. చైనాలో మృతుల సంఖ్య 3,213కు చేరిందని, ఆ తరువాత ఇటలీలో 1,809 మంది, ఇరాన్ లో 724 మంది, స్పెయిన్ లో 292 మంది, ఫ్రాన్స్ లో 127 మంది, దక్షిణ కొరియాలో 75 మంది, అమెరికాలో 68 మంది, యూకేలో 35 మంది, జపాన్ లో 24 మంది, నెదర్లాండ్స్ లో 20 మంది మృత్యువాత పడ్డారని పేర్కొంది.
ఇటు దేశంలోనూ ఏకంగా 112 మంది కరోనావైరస్ బారిన పడ్డారు. శనివారం రోజు రాత్రి 85గా నమోదైన సంఖ్య సోమవారం ఉదయానికి 112కు చేరడంతో కేంద్ర ఆరోగ్యశాఖ అందోళన చెందుతోంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో అధికసంఖ్యలో ప్రజలు ఈ వైరస్ కబంధహస్తాలలో చిక్కుకున్నారు. తొలుత కేరళవాసులు అనేకమంది ఈ వైరస్ బారిన పడగా, తాజాగా మహారాష్ట్రలో ఈ వ్యాధి లక్షణాలు వున్నవారు అనేకమంది వున్నారు. ఇదివరకు 15 కేసులు నమోదైన మహారాష్ట్రలో కొత్తగా మరో 19కేసులతో మొత్తంగా 33 కేసులు నమోదయ్యాయి.
ఇటు కేరళలో కరోనావైరస్ పాజిటివ్ నమోదైన 22తో పాటు కొత్తగా మరో రెండు కేసులు పాజిటివ్ గా తేలాయి. దీంతో కేరళలో మొత్తం 24 మంది బాధితులు ఈ వ్యాధిబారిన పడ్డారు. ఆ తరువాత అధికసంఖ్యలో బాధితులు వున్న రాష్ట్రంగా 12 కేసులతో ఉత్తర్ ప్రదేశ్, ఆ తరువాత ఏడేసి కేసులతో ఢిల్లీ, కర్ణాటకలు వున్నాయి. ఇటు తెలంగాణలో మూడు కేసులు నమోదవ్వగా ఒకరు పూర్తిగా కోలుకుగా, మరో ఇద్దరు గాంధీ అసుపత్రిలో చికిత్సపోందుతున్నారు. దేశవ్యాప్తంగా 112 కేసులు నమోదుకాగా, వారిలో 10మంది కోలుకోగా, ఇద్దరు గతవారం మరణించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more