బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా అతని అనుచరుడిపై అత్యాచార కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేయడంతో పాటు లైంగికంగా, శారీరికంగా వేధించిన మాజీ ఎమ్మెల్యేపై ఓ మహిళా మున్సిపల్ కార్పొరేటర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యే సహా అతని అనుచరుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని, దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని థానేలో జరిగింది. ఈ అరోపణల నేపథ్యంలో సదరు మాజీ ఎమ్మెల్యే తాను బీజేపి పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నానని ఇటీవలే తన నిర్ణయాన్ని ప్రకటించారు.
థానే జిల్లా గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి అరెస్టులు చేపట్టలేదు. అయితే నరేంద్ర మెహతా చేతుల్లో బాధిత కార్పోరేటర్ ఎంతటి నరకాన్ని అనుభవించిందో తెలియజేసే ఓ వీడియో రెండురోజుల క్రితం నెట్టింట్లో సంచలనంగా మారింది. దాదాపు 20 ఏళ్లుగా బాధితురాలు మాజీ ఎమ్మెల్యే చేతిలో ఈ నరకాన్ని చవిచూస్తోందని అమె తెలిపారు. ఈ వీడియో నేపథ్యంలో విమర్శలు ఎదుర్కోన్న సదరు ఎమ్మెల్యేపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, బాధితురాలికి న్యాయం చేస్తామని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి మీడియాకు తెలియజేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు మహిళా మున్సిపల్ కార్పొరేటర్ మీరారోడ్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు సదరు మహిళా కార్పొరేటర్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాలు కలిసి ఉన్న అభ్యంతరకరమైన ప్రైవేట్ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాకు ఎక్కాయి.. అవి కాస్తా వైరల్గా మారాయి. మహిళా కార్పొరేటర్ ఫిర్యాదుతో.. నరేంద్ర మెహతాపై ఐపీసీ 376(2), 496, 417, 323, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more