Kishan Reddy trolled over his comments on railway కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్న నెట్ జనులు

Union minister kishan reddy trolled over his comments on railway in telugu states

kishan reddy, troll, netizens, Red Bus, Trains, Railway, piyush goel, BJP, Union leaders, Telangana, Andhra Pradesh, Politics

Union MInister Kishan Reddy trolled online over his controversial comments on telugu people are unaware of railways instead having journeys in red buses

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్న నెట్ జనులు

Posted: 02/18/2020 09:31 PM IST
Union minister kishan reddy trolled over his comments on railway in telugu states

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలపై నెట్టింట్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ తో కలసి ఆయన చర్లపల్లిలో శాటిలైట్ రైల్వే స్టేషన్ కు శంఖుస్థాపని చేశారు. అనంతరం గుంతకల్లు-నంద్యాల మధ్య ఎలక్ట్రిక్ డబుల్ లైన్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రజలను అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేశారు. దీనిపై నెట్టింట్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ప్రజలకు ఎర్రస్సులే తప్ప రైల్వే అంటే ఏమిటో కూడా తెలియదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన.. రైల్వే ప్రయాణం అంటే అలవాటు లేని ప్రయాణమని అన్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ అయిన తరువాతే తెలుగు రాష్ట్రాల్లో అనేక కొత్త రైళ్లు ప్రారంభించారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని 427 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సౌకర్యం కల్పించారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని రైళ్లను ప్రారంభించారా.. రైల్వే లైన్లను ప్రారంభించారా.? అంటూ నిలదీస్తున్నారు ప్రజలు.

రైల్వేలు నిజాం పాలన కాలం నాటి నుంచి వున్నాయని మరికొందరు గుర్తుచేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఈ తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపి నేతలు తాము తెలుగువాళ్లం అన్న విషయాన్ని మర్చిపోయి.. సొంతవారిపైనే దిగజారుడు వ్యాఖ్యలు చేసి ఎందుకు అహాన్ని ప్రదర్శిస్తారో అర్థం కావడం లేదని.. కొందరు విమర్శిస్తున్నారు. ఇక మరికోందరు మాత్రం మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై వ్యంగంగా కామెంట్లు పెడుతున్నారు. ఔనా..? నిజమా.? అంటూ విమర్శలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kishan reddy  troll  netizens  Red Bus  Trains  Railway  piyush goel  BJP  Union leaders  Telangana  Andhra Pradesh  Politics  

Other Articles