Another Amaravati farmer dies of heart attack during stir 50 రోజులకు చేరిన రైతుల దీక్షలు.. ఆగిన మరో గుండె..

Capital decentralisation no let up in stir as farmers continue sit in on 50th day

Hanumanth Rao, Tulluru, Hyderabad, protest, heart attack, Amaravati JAC, Mangalagiri magistrate, AndhraPradesh Assembly, Amaravati, three capital, State Assembly, joint action committee, YS Jagan, Capitals, Visakhapatnam, kurnool, committee report, executive capital, legislative capital, judicial capital, Vijayawada, farmers, Andhra Pradesh, Politics

There was no let-up in protests against the YSRC government’s plan on decentralisation of the capital, as the residents of villages in the Amaravati region continued to hold sit-ins and relay hunger strikes on Wednesday. The protest of farmers of Amaravati region continues for 50 th day.

50 రోజులకు చేరిన రైతుల దీక్షలు.. ఆగిన మరో గుండె..

Posted: 02/05/2020 10:43 AM IST
Capital decentralisation no let up in stir as farmers continue sit in on 50th day

రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ బిల్లును తక్షణం ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గత 50 రోజులుగా అమరావతి ప్రాంత రైతుల అందోళనలు చేపడుతున్నారు. అమరావతిలోనే పూర్తిస్థాయి రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. రాజధానిని తరలిస్తున్నారన్న సంకేతాలు వచ్చిన రోజు నుంచే అమరావతి పరిధిలోని 29 గ్రామాల పరిధిలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనదీక్షలలో స్థానిక రైతులతో పాటు మహిళలు, యువకులు, విద్యార్థులు పాల్గోని తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు.

మందడం, తుళ్లూరు, వెలగపూడి, రాయపూడి, పెదపరిమి, కృష్ణాయపాలెంలో రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. కృష్ణాయపాలెంలో కులవృత్తులతో వినూత్న నిరసన తెలిపారు. ‘‘వద్ద వద్దు మాకు వద్దు మూడు రాజధానులు మాకు వద్దు’’ అన్న ప్లకార్డులు తమ ఎదుట పెట్టుకున్న రైతులు కులవృత్తులను అచరిస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో మొత్తం ఒక కులం వారే వున్నారన్న అధికార పార్టీ నేతలు వ్యాఖ్యలను తమ కులవృత్తులతో సమాధానం చెబుతూ ఆ ప్రాంత రైతులు అందోళనను చేపట్టారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే ఇక్కడ సేకరించిన భూమిని తీసుకుని పూర్తిస్థాయి రాజధానిగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం పెద్దన్నగా జోక్యం చేసుకుని రాజధానిగా అమరావతినే కొనసాగించేలా చూడాలని కోరారు. రాజధాని రైతుల ఆందోళనలు నేటికి 50వ రోజుకు చేరడంతో వారిని  పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. రాయపూడి, తుళ్లూరు, పెదపరిమి, తాడికొండలో ఇవాళ చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.

ఇక అమరావతి ప్రాంతంలోనే ఏకైక రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. దీక్షల్లో పాల్గోన్న పలువురు రైతులు తీవ్ర మనస్తాపానికి గురై అసువులు బాసిన విషయం తెలిసిందే. తాజాగా క్రితం రోజున మరో రైతు గుండె కూడా ఏకంగా దీక్షాస్థలిలోనే ఆగింది. రాజధానిని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. అందోళనా కార్యక్రమాలలో పాల్గోనేందుకు హైదరాబాద్ నుంచి వెళ్లిన హనుమంతరావు (72) అనే రైతు క్రితం రోజున దీక్షస్థలిలోనే గుండెపోటుకు గురై మరణించారు. హైదరాబాద్ నుంచి తూళ్లూరు వెళ్లిన హనుమంతరావు దీక్షలో పాల్గోంటూ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. నిరసనకారులు వెనువెంటనే ఆయనను అస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles