Man sets lecturer ablaze in Vidarbha ప్రేమోన్మాది ఘాతుకం.. లెక్చరర్ సజీవదహనం..

Female lecturer burnt alive in maharashtra s wardha accused absconding

lecturer set ablaze, jilted lover, ankita pisudde, Bikesh Nagrale, Nandori Chowk, Orancity Hospital and Research Centre, Hinghanghat police, Wardha, Nagpur, Vidarbha, nagpur crime news, Nagpur crime

A lecturer, Ankita Pisudde, 25, was set ablaze in front of her college at busy Nandori Chowk in Hinghanghat district in Vidarbha. The victim had sustained around 32%-40% burns and is fighting for life at Orancity Hospital and Research Centre in Nagpur, The alleged perpetrator Bikesh Nagrale in Police custody.

ITEMVIDEOS: ప్రేమోన్మాది ఘాతుకం.. లెక్చరర్ సజీవదహనం..

Posted: 02/04/2020 11:15 AM IST
Female lecturer burnt alive in maharashtra s wardha accused absconding

ప్రేమ పేరుతో జరగుతున్న దారుణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వివాహం అయినా తమ పద్దతిని మార్చుకోని యువకులు.. యువతుల వెంటపడి తమను ప్రేమించమని బలవంతం చేస్తున్న ఘటనలు అనేకం నమోదవుతూనే వున్నాయి. అందుకు అంగీకరించని యువతులపై ప్రేమోన్మాదులు దారుణాలకు తెగబడుతూనే వున్నారు. ప్రేమోన్మాదులు తమను నిరాకరించిన యువతులను టార్గెట్ గా చేసుకుని దారుణ అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం నమోదవుతున్నాయి. వీరిని కటకటాల వెనక్కి నెట్టి కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. ఇంకా స్వేచ్ఛా వాయువును పీలుస్తున్న యువతలో మాత్రం మార్పు రావడం లేదు.

తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే జరిగింది. వివాహితుడైన ఓ వ్యక్తి తనకు పుట్టిన బిడ్డ వున్నప్పటికీ.. ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించాడు. దీంతో పాటు తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తడి తీసుకువచ్చాడు. తనను దూరం పెడుతోందన్న అక్కస్సుతో అమె లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న కాలేజీ ఆవరణ వెలుపలే అమెపై పట్టపగలు కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. తీవ్రగాయాలపాలపైన బాధిత యువతి అసుపత్రిలో జీవన్మరణాల మధ్య కొట్టుమిట్టాడుతోంది. నిప్పంటించిన అగంతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దడోరా గ్రామానికి చెందిన ఓ యువతి స్థానిక విదర్భలోని హింఘన్ ఘాట్ జిల్లా నందోరి చౌక్ లోని ఓ కాళాశాలలో లెక్చరర్ గా విధులు నిర్వహిస్తోంది. అదే గ్రామానికి చెందిన వికేశ్ అలియాస్ విక్కీ అనే వివాహితుడు.. అమెతో వున్న పరిచయాన్ని అడ్డుపెట్టుకుని యువతి వెంటపడుతూ ప్రేమిస్తున్నాని వెంటపడేవాడు. ఏడు నెలల పిల్లాడు వున్నా.. ఇలా వెంటపడి వేధిస్తున్న కారణంగా.. అతని ప్రవర్తన నచ్చని బాధిత యువత అతడ్ని గత రెండేళ్లుగా దూరంగా పెట్టింది. మార్గమధ్యంలో పలు పర్యాయాలు కనిపించినా పట్టించుకోకుండా వెళ్లిపోయింది.

దీంతో కోపంతో రగలిపోయిన వికేశ్.. లెక్చరర్ కు తనను కాదన్న ఫలితం ఎలా వుంటుందో చూపాలని అమె కోసం కళాశాల వద్ద కాపుకాశాడు. అంకిత బయటకు రాగానే ఆమెతో గొడవకు దిగాడు. అది మరింత ముదరడంతో వెంట తెచ్చుకున్న కిరోసిన్ ను ఆమెపై చల్లి నిప్పంటించాడు. స్థానికులు అప్రమత్తమయ్యేలోగానే బైక్‌పై పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన అంకితను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నాగ్‌పూర్ తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, అమె తల, ముఖంపై తీవ్రగాయాలు అయ్యాయని, దీంతో అమె శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు పడుతోందని వైద్యులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles