ప్రేమ పేరుతో జరగుతున్న దారుణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వివాహం అయినా తమ పద్దతిని మార్చుకోని యువకులు.. యువతుల వెంటపడి తమను ప్రేమించమని బలవంతం చేస్తున్న ఘటనలు అనేకం నమోదవుతూనే వున్నాయి. అందుకు అంగీకరించని యువతులపై ప్రేమోన్మాదులు దారుణాలకు తెగబడుతూనే వున్నారు. ప్రేమోన్మాదులు తమను నిరాకరించిన యువతులను టార్గెట్ గా చేసుకుని దారుణ అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం నమోదవుతున్నాయి. వీరిని కటకటాల వెనక్కి నెట్టి కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. ఇంకా స్వేచ్ఛా వాయువును పీలుస్తున్న యువతలో మాత్రం మార్పు రావడం లేదు.
తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే జరిగింది. వివాహితుడైన ఓ వ్యక్తి తనకు పుట్టిన బిడ్డ వున్నప్పటికీ.. ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించాడు. దీంతో పాటు తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తడి తీసుకువచ్చాడు. తనను దూరం పెడుతోందన్న అక్కస్సుతో అమె లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న కాలేజీ ఆవరణ వెలుపలే అమెపై పట్టపగలు కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. తీవ్రగాయాలపాలపైన బాధిత యువతి అసుపత్రిలో జీవన్మరణాల మధ్య కొట్టుమిట్టాడుతోంది. నిప్పంటించిన అగంతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దడోరా గ్రామానికి చెందిన ఓ యువతి స్థానిక విదర్భలోని హింఘన్ ఘాట్ జిల్లా నందోరి చౌక్ లోని ఓ కాళాశాలలో లెక్చరర్ గా విధులు నిర్వహిస్తోంది. అదే గ్రామానికి చెందిన వికేశ్ అలియాస్ విక్కీ అనే వివాహితుడు.. అమెతో వున్న పరిచయాన్ని అడ్డుపెట్టుకుని యువతి వెంటపడుతూ ప్రేమిస్తున్నాని వెంటపడేవాడు. ఏడు నెలల పిల్లాడు వున్నా.. ఇలా వెంటపడి వేధిస్తున్న కారణంగా.. అతని ప్రవర్తన నచ్చని బాధిత యువత అతడ్ని గత రెండేళ్లుగా దూరంగా పెట్టింది. మార్గమధ్యంలో పలు పర్యాయాలు కనిపించినా పట్టించుకోకుండా వెళ్లిపోయింది.
దీంతో కోపంతో రగలిపోయిన వికేశ్.. లెక్చరర్ కు తనను కాదన్న ఫలితం ఎలా వుంటుందో చూపాలని అమె కోసం కళాశాల వద్ద కాపుకాశాడు. అంకిత బయటకు రాగానే ఆమెతో గొడవకు దిగాడు. అది మరింత ముదరడంతో వెంట తెచ్చుకున్న కిరోసిన్ ను ఆమెపై చల్లి నిప్పంటించాడు. స్థానికులు అప్రమత్తమయ్యేలోగానే బైక్పై పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన అంకితను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నాగ్పూర్ తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, అమె తల, ముఖంపై తీవ్రగాయాలు అయ్యాయని, దీంతో అమె శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు పడుతోందని వైద్యులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more