జామియా విశ్వవిద్యాలయం వద్ద మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు గత కొన్ని రోజులుగా నిరసనలు, అందోళనలు చేపట్టడుతున్న సందర్భంగా.. వారిని టార్టెగ్ చేసుకున్న అగంతకలు వారిపై కాల్పులకు తెగబడుతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో మూడో కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. సీఏఏ వ్యతిరేకంగా విద్యార్థులు వర్సిటీ ముందున్న రోడ్డు పై బైఠాయించి ఆందోళన చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
క్రితంరోజు అర్ధరాత్రి తర్వాత స్కూటీ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని అగంతకులు తొలుత ఐదో నంబరు గేటు, తర్వాత ఒకటో నంబరు గేటువద్ద కాల్పులు జరిపి పారిపోయారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. గత గురువారం రాజఘాట్ కు ర్యాలీగా వెళ్తున్న వారిపై కాల్పులు జరిగాయి. ఆ తర్వాత రెండు రోజులకు మరోసారి ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. తాజాగా మూడో ఘటన చోటు చేసుకోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అగంతకుల చర్యలకు నిరసనగా విద్యార్ధులు నిరనన చేపట్టారు.
ఢిల్లీలోని షాహీన్ బాగ్ కు సరిగ్గా రెండు కిలోమీటర్ల దూరంలో విద్యార్థులు టెంట్ ఏర్పాటు చేసుకుని గత రెండు నెలలుగా సీఏఏ కు వ్యతిరేకంగా నిరసన దీక్షలు చేపట్టారు. కాగా, ఈ కాల్పుల ఘటనపై స్పందించిన ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ మాట్లాడుతూ కాల్పుల ఘటనలో ఏ ఒక్కరూ గాయపడలేదని తెలిపారు. కాగా, నిరసన దీక్షల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుబలగాలను మోహరించినట్లు తెలిపారు. విద్యార్థుల నుంచి వారి వాంగ్మూలం సేకరించినట్లు తెలిపారు. ఇక ఘటనాస్థలంలో వద్దనున్న సిసీటీవీ ఫూటేజీలను కూడా పరిశీలించేందుకు మరో బృందం వెళ్లిందని తెలిపారు.
కాగా, అర్థరాత్రి వేళ కాల్పుల మోత వినిపించగానే చిన్న సమూహంగా ఏర్పడిన విద్యార్థులు అక్కడి నుంచి ఒక్కసారిగా పరుగులు తీసి తమ ప్రాణాలను రక్షించుకునేందుకు పరుగులు తీసిన దృశ్యాలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, రంగంలోకి దిగిన జామియా నగర్ పోలీసులకు అక్కడ బులెట్ షెల్స్ లభించకపోవడం గమనార్హం. ఇదే సమయంలో అగంతకులు వచ్చిన వాహనాన్ని కొందరు ద్విచక్రంగా పేర్కొనగా, మరికొందరు దానిని నాలుగచక్రాల వాహనంగా పేర్కోన్నారు. పోలీసుల ఆధారలు లేవని చెప్పడంతో విద్యార్థులు పోలిస్ స్టేషన్ ఎదుట గుమ్మిగూడారు.
#WATCH Delhi: People gather in protest outside Jamia Millia Islamia University following an incident of firing at gate no.5 of the university. 2 scooty-borne unidentified people had fired bullets at the spot. SHO (Station house officer) is present at the spot. Investigation is on pic.twitter.com/EKlxQPBVum
— ANI (@ANI) February 2, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more