ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ ఫీఠమెక్కినా.. ఎవ్వరెదురైనా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము.. అంటూ రాయప్రోలు రాసిన పాటను కూడా అలకించకుండా.. సప్త సముద్రాలు దాటి వెళ్లినా.. మోసం, దగా, కుట్రలతో కూడిన జీవనం సాగిస్తున్న ఘనుల ఉదంతమిది. మనవారిని దోచేస్తే కేవలం రూపాయలు.. అదే అమెరికావాసులను దోచేస్తే డాలర్లు అనుకున్నారో ఏమోగానీ.. ఈజీ మని వేటలోపడి అగ్రరాజ్యం పోలీసులకు అడ్డంగా చిక్కి.. కటకటాలు లెక్కపెడుతున్నారు ముగ్గురు భారతయులు.
ఫలితంగా అగ్రరాజ్యం అమెరికా ఏకంగా మూడు కాల్ సంటర్ కంపెనీలతో పాటు ముగ్గురు వ్యక్తులపై అక్కడి న్యాయస్థానంలో కేసులు వేసింది. ఇప్పటికే పలుమార్లు వారిని రెడ్ నోటీసులు ఇచ్చి హెచ్చిరించినా.. ఫలితం లేకుండా పదే పదే వారు అమెరికన్లను టార్గెట్ చేస్తూ.. కాల్స్ చేయడం.. తమను తాము ప్రభుత్వ, వ్యాపార సంబంధిత కాల్ సెంటర్ వ్యక్తులుగా పేర్కోని పెద్దఎత్తున ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని పిర్యాదు చేశారు. కాగా వీటిలో అధికంగా భారత్ నుంచి వస్తున్న కాల్స్అని అమెరికా న్యాయవిభాగం గుర్తించింది.
ఈ సారి అమెరికాలో ఈ మోసపూరిత కాల్ సెంటర్లకు అనుకూలంగా పనిచేస్తున్న వారిని కూడా అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. అయితే ఈ కాల్ సెంటర్లను పూర్తిగా విచారించి చర్యలు తీసుకునేందుకు వీలు కల్పించడంతో పాటు వారు కొనసాగిస్తున్న సేవలను తక్షణం నిలిపివేసేందుకు కూడా అనుమాతి ఇవ్వాలని కోరింది. కాగా, కాల్ సెంటర్ పేరిట 37 లక్షల డాలర్ల (సుమారు రూ. 26.36 కోట్లు) మోసానికి పాల్పడిన కేసులో అమెరికాలో ముగ్గురు ఇండియన్స్ సహా ఎనిమిది మందికి జైలు శిక్ష పడింది. భారత్ కేంద్రంగా జరిగిన కాల్ సెంటర్ ఫ్రాడ్ గత సంవత్సరం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మోసంలో నష్టపోయింది అమెరికన్లే.
ఈ కేసులో జార్జియాలో నివాసం ఉంటున్న మొహమ్మద్ కాజిమ్ మొమిన్, మొహమ్మద్ సోజబ్ మొమిన్, పాలక్ కుమార్ పటేల్ లను అరెస్ట్ చేసిన అధికారులు, వారిపై చార్జ్ షీట్ దాఖలు చేయగా, కోర్టు విచారణ జరిపింది. వీరికి ఆరు నెలల నుంచి నాలుగు సంవత్సరాల 9 నెలల వరకు వేర్వేరుగా జైలు శిక్షలు విధించింది. డేటా బ్రోకర్ల నుంచి సమాచారం తీసుకుని, వారికి ఫోన్ చేసి, తాము ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగులమని, మీరు ప్రభుత్వ పన్నులు చెల్లించలేదని, భారీ జరిమానా పడుతుందని భయపెట్టి, వారి నుంచి డబ్బులు వసూలు చేసేవారు. ఇందుకోసం అహ్మదాబాద్ లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకుని, ఇండియాలోని కొందరితో కలసి కుట్ర చేసి ఈ మోసానికి తెరలేపారని ప్రాసిక్యూషన్ కోర్టులో రుజువు చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more