ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలో దోచుకున్న డబ్బుతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నేతలను భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలు నిజాయతీగా జరగలేదని విమర్శించారు. గాంధీ భవన్లో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల ప్రకటనకు ముందే అందరు మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు.
తన జీవితంలో ఇలాంటి మున్సిపల్ ఎన్నికలను ఎప్పుడూ చూడలేదని ఎంపీ విమర్శించారు. ఎక్స్ అఫీషియో ఓట్లతోనే యాదగిరి గుట్ట పురపాలికను కైవసం చేసుకున్నారని, ఆదిభట్లలో కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చినా కాంగ్రెస్ కౌన్సిలర్లను తీసుకెళ్లి టీఆర్ఎస్ ఛైర్మన్ గా చేశారని మండిపడ్డారు. సిరిసిల్లలో టీఆర్ఎస్ రెబెల్స్ పోటీ చేస్తే వారిని సస్పెండ్ చేస్తానని తొలుత తొడగొట్టిన మంత్రి కేటీఆర్, ఇప్పుడు మళ్లీ వారి గడ్డాలను దువ్వి మరీ వారిని పార్టీలోకి చేర్చుకున్నారని, ఓట్లు వేయవద్దని చెప్పిన నోటితోనే వారిని అహ్వానించారని.. ఇంత నీతి తప్పిన రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్లుగా వ్యవహరిస్తున్న కేటీఆర్ది నోరా.. తాటిమట్టా? అని ఎద్దేవా చేశారు. గజ్వేల్లో నారాయణ రెడ్డి అనే వ్యక్తిని ఛైర్మన్ చేస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. ఇక హైదరాబాద్ నగర శివారు అయిన పెద్ద అంబర్ పేట, చౌటుప్పల్ లో కాంగ్రెస్ కౌన్సిలర్లను తమ పార్టీలోకి లాగేసుకున్నారని, చౌటుప్పల్ లో సీపీఎం అభ్యర్థులను కొనేశారని ఆరోపించారు. గత 25 ఏళ్లలో ఇంత ఘోరమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రజాకార్ల కంటే దారుణంగా పోలీసులు వ్యవహరించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి పరాకాష్టగా ఈ ఎన్నికలు నిలుస్తున్నాయని ధ్వజమెత్తారు.
కేసీఆర్, కేటీఆర్ అక్రమాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో తిరిగి ఎండగడతామని కోమటిరెడ్డి తేల్చి చెప్పారు. వారు సిగ్గు లేకుండా పని చేస్తున్నారని, నల్గొండలో టీఆర్ఎస్-బీజేపీ, ఎంఐఎం పొత్తు పెట్టుకున్నాయని గుర్తు చేశారు. ఏదో ఒక రోజు కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళ్లే రోజు వస్తుందని జోస్యం చెప్పారు. వాళ్లు చేసిన అవినీతిపై ఆధారాలను ఈడీ, విజిలెన్స్ వంటి దర్యాప్తు సంస్థలకు తానే అందిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్, కేటీఆర్ లను వదిలిపెట్టబోడని హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more