Nirbhaya case convicts seeks judicial review of rejection of mercy petition ‘నిర్భయ’ దోషులకు ఉరే తరువాయి.. మరో ఎత్తుగడ

Nirbhaya case mukesh kumar moves sc seeks judicial review of rejection of mercy petition by prez

last wish, Tihar Jail authorities, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts mercy petition, Satish Kumar Arora, Supreme Court, Additional Registrar, deputation basis, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, Supreme Court, gang-rape, Mount Elizabeth Hospital, Tihar jail, Crime

One of the death row convicts in the 2012 Nirbhaya murder and gang rape case on Saturday moved the Supreme Court seeking judicial review of the rejection of mercy petition by the President. The petition has been filed by convict Mukesh Kumar Singh (32) whose mercy plea was dismissed by President Ram Nath Kovind on January 17.

‘నిర్భయ’ దోషులకు ఉరే తరువాయి.. మరో ఎత్తుగడ

Posted: 01/25/2020 03:44 PM IST
Nirbhaya case mukesh kumar moves sc seeks judicial review of rejection of mercy petition by prez

దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీత తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. దాని నుంచి తప్పించుకునేందుకు దోషులు రకరకాల ఎత్తులు వేస్తూ న్యాయస్థానం విలువైన సమయాన్ని వృదా చేస్తున్నారు. దోషుల చివరి కోరిక తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాల్లో ఈ తాము ఈ సారి కూడా శిక్షను వాయిదా వేసుకుంటామన్న ధీమా దోషుల్లో స్పష్టంగా ప్రస్పుటించిందని జైలు అధికారులు తెలిపారు.

తాజాగా ముగ్గురు దోషులు తమకు క్షమాబిక్ష, క్యూరేటివ్ పిటీషన్లు దాఖలు చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లను తీహార్ జైలు అధికారులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని, దీంతో ఆ పిటీషన్లను తాము సకాలంలో న్యాయస్థానంలో దాఖలు చేయలేకపోతున్నామని ఢిల్లీలోని పాటియాల కోర్టును ఆశ్రయించి వేసిన పిటీషన్లను న్యాయస్థానం కోట్టివేసింది. పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మల తరుపన క్షమాబిక్ష, క్యూరేటివ్ పిటీషన్ దాఖలు చేయడానికి సంబంధించిన డాక్యూమెంట్లను ఇచ్చేందుకు జైలు అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని వారి న్యాయవాది ఏపీ సింగ్ పిటీషన్లో పేర్కోన్నారు.

ఈ పీటీషన్లను పరిశీలించిన న్యాయమూర్తి ఇరువర్గాల వాదోపవాదాలు విన్న తర్వాత దోషుల పిటీషన్లను కొట్టివేశారు. ఢిల్లీ పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ దోషులకు ఎప్పుడెప్పుడు ఏయే పత్రాలు అందించింది సవివరంగా తెలిపారు. దోషుల తరపు న్యాయవాది మాట్లాడుతూ వినయ్ శర్మపై విషప్రయోగం జరిగిందని, అందుకే అతన్ని ఆసుపత్రిలో చేర్చారని, దీనికి సంబంధించి వైద్య ధ్రువపత్రం ఇప్పటికీ ఇవ్వలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. అతని మానసిక పరిస్థితి బాగాలేదని, జైల్లో ఆహారం కూడా తినడం లేదని, వైద్య నివేదిక ఇస్తే క్షమాభిక్ష పెట్టుకునేందుకు అవకాశం కలుగుతుందని కోర్టుకు తెలిపారు. అయితే ఈ వాదనలను న్యాయమూర్తి పట్టించుకోలేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చిన వివరణ మేరకు సంతృప్తి చెందుతూ పిటిషన్లు కొట్టేశారు.

ఇక తాజాగా మరో ఎత్తుగడ

ఇక తాము చేసిన ఘాతుకానికి ఏఢేళ్ల తరువాత శిక్షను ఎదుర్కోబోతున్న తరుణంలో నిందితులు ఎత్తుగడలు వేస్తూ శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తాజాగా ముఖేస్ సింగ్ అనే దోషి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన క్షమాభిక్ష పిటీషన్ ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ముఖేష్ సింగ్ తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. తాను దోషిగా తేలిన ఈ కేసులో తనకు మరణశిక్ష  నుంచి మినహాయింపు కల్పిస్తూ క్షమాభిక్ష పెట్టాలని ముఖేష్ సింగ్ రాష్ట్రపతికి పిటీషన్ పేట్టుకోగా, దానిని రాష్ట్రపతి ఈ నెల 17న తిరస్కరించారు. ఈ క్రమంలో దోషులకు ఈ నెల 22న విధించాల్సిన ఉరి శిక్షను కూడా న్యాయస్థానం వాయిదా వేసింది. కాగా, తాజాగా దానిని సవాల్ చేస్తూ మరో పిటీషన్ దాఖలయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles