దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీత తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. దాని నుంచి తప్పించుకునేందుకు దోషులు రకరకాల ఎత్తులు వేస్తూ న్యాయస్థానం విలువైన సమయాన్ని వృదా చేస్తున్నారు. దోషుల చివరి కోరిక తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాల్లో ఈ తాము ఈ సారి కూడా శిక్షను వాయిదా వేసుకుంటామన్న ధీమా దోషుల్లో స్పష్టంగా ప్రస్పుటించిందని జైలు అధికారులు తెలిపారు.
తాజాగా ముగ్గురు దోషులు తమకు క్షమాబిక్ష, క్యూరేటివ్ పిటీషన్లు దాఖలు చేసుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లను తీహార్ జైలు అధికారులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని, దీంతో ఆ పిటీషన్లను తాము సకాలంలో న్యాయస్థానంలో దాఖలు చేయలేకపోతున్నామని ఢిల్లీలోని పాటియాల కోర్టును ఆశ్రయించి వేసిన పిటీషన్లను న్యాయస్థానం కోట్టివేసింది. పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మల తరుపన క్షమాబిక్ష, క్యూరేటివ్ పిటీషన్ దాఖలు చేయడానికి సంబంధించిన డాక్యూమెంట్లను ఇచ్చేందుకు జైలు అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని వారి న్యాయవాది ఏపీ సింగ్ పిటీషన్లో పేర్కోన్నారు.
ఈ పీటీషన్లను పరిశీలించిన న్యాయమూర్తి ఇరువర్గాల వాదోపవాదాలు విన్న తర్వాత దోషుల పిటీషన్లను కొట్టివేశారు. ఢిల్లీ పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ దోషులకు ఎప్పుడెప్పుడు ఏయే పత్రాలు అందించింది సవివరంగా తెలిపారు. దోషుల తరపు న్యాయవాది మాట్లాడుతూ వినయ్ శర్మపై విషప్రయోగం జరిగిందని, అందుకే అతన్ని ఆసుపత్రిలో చేర్చారని, దీనికి సంబంధించి వైద్య ధ్రువపత్రం ఇప్పటికీ ఇవ్వలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. అతని మానసిక పరిస్థితి బాగాలేదని, జైల్లో ఆహారం కూడా తినడం లేదని, వైద్య నివేదిక ఇస్తే క్షమాభిక్ష పెట్టుకునేందుకు అవకాశం కలుగుతుందని కోర్టుకు తెలిపారు. అయితే ఈ వాదనలను న్యాయమూర్తి పట్టించుకోలేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చిన వివరణ మేరకు సంతృప్తి చెందుతూ పిటిషన్లు కొట్టేశారు.
ఇక తాజాగా మరో ఎత్తుగడ
ఇక తాము చేసిన ఘాతుకానికి ఏఢేళ్ల తరువాత శిక్షను ఎదుర్కోబోతున్న తరుణంలో నిందితులు ఎత్తుగడలు వేస్తూ శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తాజాగా ముఖేస్ సింగ్ అనే దోషి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన క్షమాభిక్ష పిటీషన్ ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ముఖేష్ సింగ్ తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. తాను దోషిగా తేలిన ఈ కేసులో తనకు మరణశిక్ష నుంచి మినహాయింపు కల్పిస్తూ క్షమాభిక్ష పెట్టాలని ముఖేష్ సింగ్ రాష్ట్రపతికి పిటీషన్ పేట్టుకోగా, దానిని రాష్ట్రపతి ఈ నెల 17న తిరస్కరించారు. ఈ క్రమంలో దోషులకు ఈ నెల 22న విధించాల్సిన ఉరి శిక్షను కూడా న్యాయస్థానం వాయిదా వేసింది. కాగా, తాజాగా దానిని సవాల్ చేస్తూ మరో పిటీషన్ దాఖలయ్యింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more