తెలంగాణలోని 120 పురపాలక సంఘాలు, 9 నగరపాలక సంస్థలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలలో ప్రతిపక్షాలకు చెందిన పార్టీలు కూడా తమ సత్తాను చాటుకునేందుకు సిద్దంగా వున్నాయి. ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎన్నికల బందోబస్తు కోసం 50 వేల మంది పోలీసులతో పటిష్టమైన పహారా ఏర్పాటు చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలున్న జిల్లాల్లో బందోబస్తపై ప్రత్యేక దృష్టి సారించారు.
పురపాలక సంఘాలకు సంబంధించి 2,647 వార్డుల్లో 11,179 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నగర పాలక సంస్థల్లోని 322 డివిజన్లలో 1,747 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోకున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో మున్సిపాలిటీల్లో 6188 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయగా, కార్పోరేషన్లలో 1773 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పురపాలక సంఘాలతో పాటు కార్పోరేషన్ల పరిధిలో మొత్తంగా 50 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
కాగా పోలింగ్ నేపథ్యంలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలపై ఎన్నికల అధికారులు ప్రతేక దృష్టి సారించి 2,406 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. 2,406 పోలింగ్ కేంద్రాల్లో జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాలతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇక మరో 2072 కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ తీస్తున్నారు. 1240 కేంద్రాల వద్ద సూక్ష్మ పరిశీలకులు పర్యవేక్షణ కోనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో ఉదయం నుంచే పోలింగ్ జోరందుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more