ఆంధ్రుల ఆరాధ్యుడు, సినీనటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 24వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ పార్టీ శ్రేణులు ఆయనకు ఘననివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ లోని సమాధి వద్దకు చేరుకున్న కుటుంబసభ్యులు ఆయనకు నివాళులు సమర్పించారు. వేకువజామునే ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్న తారక్, కళ్యాణ్ రామ్ లను నేరుగా తమ తాతయ్య సమాధి వద్దకు వెళ్లి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఇక ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లు వస్తున్నారన్న సమాచారం వున్న అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అంతకుముందే నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఆ తరువాత ఎన్టీఆర్ తనయ, మాజీ కేంద్ర మంత్రి బీజేపి నేత ఫురందేశ్వరి, నందమూరి సహాసిని, రామకృష్ణ తదితరలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరకుని నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఘాట్ చుట్టూ ప్రదక్షిణలు చేసి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రజా నాయకుడు ఎన్టీఆర్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంతో ముందుచూపుతో ప్రజాసంక్షేమమే పరమావధిగా భావించిన మహానేత అని కోనియాడారు. బావితరాలకు బంగారు భవిష్యత్తును అందించాలనే సుదూరలక్ష్యమున్న విజనరీ కలిగిన నాయకుడని అన్నారాయన. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. తారక రాముడి విగ్రహానికి చంద్రబాబు పుష్పాంజలి ఘటించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో సమాజానికి మేలు చేసేలా ముందుకెళ్లాలని టీడీపీ కార్యకర్తలకు, నందమూరి అభిమానులకు చంద్రబాబు పిలుపిచ్చారు.
ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన స్వర్గీయ నేత ఎన్టీఆర్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలకు హెచ్ఎండీఏ ఏర్పాట్లు చేయకపోవడం శోచనీయమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. ఈ నేపథ్యంలో టీటీడీపీ ఎన్టీఆర్ ఘాట్లో స్వయంగా ఏర్పాట్లు చేసింది. సమాధి పెచ్చులూడుతుండటంతో పాటు పుష్పాలంకరణపై హెచ్ఎండీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. దీంతో సమాధి అలంకరణ పనులు పార్టీ పరంగా చేపట్టాలని టీటీడీపీ నిర్ణయించి.. మరమ్మతులతో పాటు పుష్పాలంకరణ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more