భారత రైల్వే చరిత్రలోనే తొలి ప్రైవేటు రైలుగా పేరుగాంచిన తేజస్ ఎక్స్ప్రెస్.. ఇవాళ రెండో మార్గంలో అందుబాటులోకి వచ్చింది. ప్రధాన మంత్రి సొంత నియోజకవర్గం వారణాసి నుంచి ఢిల్లీకి పయనమయ్యే తొలి ప్రైవేటు రైలు ఇక తన మార్గాలను విస్తరించుకుంది. ఢిల్లీ నుంచి వారణాసీ తరువాత తాజాగా అహ్మదాబాద్-ముంబయి మార్గంలో తేజస్ రైలును పరుగులు పెట్టనుంది. ఐఆర్సీటీసీకి చెందిన రెండో ప్రైవేటు రైలు మార్గాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఇవాళ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు.
వారంలో గురువారం మినహా అన్ని రోజుల పాటు ఈ రైలు ఈ మార్గంలో సేవలు అందించనుంది. గుజరాత్ నుంచి కేవలం ఆరున్నర గంటల్లో ఈ రైలు ముంబయి చేరుకోనుంది. ఇవాళ లాంఛనంగా ప్రారంభమైనా ఈ నెల 19 నుంచి ఈ రైలు వాణిజ్యపరంగా సేవలను అందించనుంది. తేజస్ రైలు ప్రారంభోత్సవానికి కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ హాజరుకావాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన రాలేకపోయారు. ఈ విషయాన్ని బీజేపి ఎంపీ కిరిట్ సోలంకీ మీడియాకు తెలిపారు. దీంతో గుజరాత్ సీఎం దీనిని ప్రారంభించారన్నారు.
తేజస్ రైలు ఆగమనంలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు లబ్దిపోందుతాయని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అశాభావం వ్యక్తం చేశారు. తేజస్ రైలు తమ రాష్ట్రానికి గర్వకారణమని చెప్పుకోచ్చారు. ఇదే మార్గంలో బుల్లెట్ రైలు కోసం పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఇక బుల్లెట్ రైలు కూడా అందుబాటులోకి వస్తే రెండు రాష్ట్రాలు అభివృద్దలో మిగతా రాష్ట్రాలతో పోటీపడుతూ దూసుకుపోవడం ఖాయంగా చెప్పుకోచ్చారు. అధునాతన సౌకర్యాలు, హంగులతో తేజస్ రైలును తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా 100 మార్గాల్లో 150 రైళ్లను ప్రైవేటు ఆపరేటర్ల ఆధ్వర్యంలో నడపాలని రైల్వేశాఖ యోచిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more