టాలీవుడ్ ప్రముఖులే లక్ష్యంగా ఇటు అదాయపన్ను శాఖ అధికారులతో పాటు అటు జీఎస్టీ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సినీప్రముఖులే టార్గెట్ గా ఈ దాడులు జరుగుతున్న ఈ దాడులు అటు నిర్మాతలు, దర్శకులతో పాటు హీరోయిన్లను కూడా టార్గెట్ చేస్తున్నాయి. సినీప్రముఖులకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు పలు పర్యాయాలుగా సోదాలు చేస్తున్నారు. వీరితో పాటు ఇటీవల ప్రముఖ బిల్డర్స్, స్టీల్ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థలపై కూడా ఇవాళ దాడులు కొనసాగిన విషయం తెలిసిందే.
తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రం హీట్ కావడంతో మంచి జోరుమీదున్న కథానాయిక రష్మికకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. అమె నివాసంలో ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లా విరాజ్ పేటలోని ఆమె నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ ఉదయం 7.30 గంటల ప్రాంతంలో సోదాలు ప్రారంభమయ్యాయి. రష్మిక ఆదాయ లెక్కలను పరిశీలిస్తున్నారు. దీనిపై రష్మిక మేనేజర్ స్పందిస్తూ.. ఇలాంటి ఐటీ దాడులు సహజమే అన్నారు.
గీతా ఆర్ట్స్ 2 నిర్మించిన గీతా గోవిందం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చిన రష్మిక.. తాజాగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలై, దూసుకెళ్తున్న తరుణంలో అదాయశాఖ అధికారులు ఆమెకు షాకిచ్చారు. ఆమె నివాసంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. మరోపక్క రష్మిక, నితిన్ జంటగా నటించిన ‘భీష్మ’ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోపక్క అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో నటించబోతున్నారు. కార్తితో కలిసి ఓ తమిళ సినిమాలోనూ రష్మిక నటిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more