ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న డిమాండ్ తో ఆయా ప్రాంతాల రైతులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు ఇవాళ్లితో 21వ రోజుకు చేరాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 20 తరువాత విశాఖలో కార్యనిర్వాహక రాజధానిని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ముందుకు కదులుతున్న క్రమంలో అమరావతి రైతులు మహాధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో పాటు ఇవాళ అమరావతిలోని సచివాలయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తున్నారని తెలుసుకున్న రైతులు మందడంలో మహాధార్న ను చేపట్టి.. రోడ్డుపై బైఠాయించాలని కూడా భావించారు.
అయితే రైతులు వ్యూహాన్ని ముందే పసిగట్టిన పోలీసులు రైతులు రోడ్డుపైకి రాకుండా అనేక ఆంక్షలు విధించారు. ఒక విధంగా చెప్పాలంటూ ముఖ్యమంత్రి రాక సందర్భంగా అమరావతి గ్రామాల్లో అప్రకటిత కర్ప్యూ వాతవరణం అలుముకుంది. ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. గ్రామస్థులను రోడ్డపైకి రాకుండా చేయడంలో సఫలీకృతమైన పోలీసులు మరోరకంగా వారిని ఇళ్లకు మాత్రమే పరిమితం చేయగలిగారు. గ్రామాస్థులు ప్రధాన రోడ్లపైకి రాకుండా అడ్డుగా కంచె వేశారు. రహదారి సమీపంలో వున్న దుకాణాలను మూసివేయించారు.
ఈ క్రమంలో రైతులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. స్వచ్ఛందంగా బంద్ పాటించినప్పుడు తమ దుకాణాలను బలవంతంగా తెరిపించిన పోలీసులు.. ముఖ్యమంత్రి వస్తున్నారని దుకాణాలను మూసివేయించడమేంటని ప్రశ్నిస్తున్నారు. సీఎం సచివాలయానికి వచ్చిన ప్రతిసారి దుకాణాలు మూసివేయాలా.? ప్రభుత్వం తమను తమ వ్యాపారాలు కూడా చేసుకోనివ్వదా.? అసలు ప్రభుత్వం వున్నది తమ కోసమా.? లేక తాము ప్రభుత్వం కోసం వున్నామా అంటూ ప్రశ్నించారు. ఇక గ్రామాల నుంచి రైతులు ఎవరూ బయటకు రాకుండా రైతులు కూడా సహకరించాలని కోరిన పోలీసులు.. సహకారం అంటే కంచెలు వేయడమేనా అంటూ నిలదీశారు.
బంద్ పాటించినప్పుడు అత్యవసర దుకాణాలను తెరచిన తమకు గ్రామస్థులు సహకరించారని, అయితే ముఖ్యమంత్రి రాక సందర్భంగా కనీసం మందుల దుకాణాలు, అసుపత్రులను కూడా పోలీసులు తెరవనీయడం లేదని వారు అరోపించారు. తమ గ్రామాల చుట్టూ కంచెలు వేయించిన తరువాత ముఖ్యమంత్రి సచివాలయానికి రాగలుగుతున్నారని, ఇంత భయం ఆయనకెందుకని రైతులు నిలదీస్తున్నారు. మరోవైపు సీపీఎం పార్టీ కార్యాలయంలో సమావేశమైన 20 మంది మందడం రైతులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసుల వ్యాను కింద పడుకుని నిరసనకారులు తమ అందోళనను వ్యక్తం చేశారు. బలవంతంగా రైతులను లాగేసి వారిని గుంటూరు తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more