ఏటీఎం మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) నడుం బిగించింది. తమ బ్యాంకు ఖాతాదారులతో పాటు డబ్బు విత్ డ్రా చేసే ఖాతాదారుల భద్రత ఎంతో ముఖ్యమని జాగ్రత్త చర్యలకు పూనుకుంది. జనవరి 1 మొదలు ఎస్బీఐ ఏటీఎం కేంద్రాలలో డబ్బు డ్రా చేస్తే.. ముందుగా ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే తప్ప ఖాతాదారులకు డబ్బులు విత్ డ్రా కావు.
జనవరి 1 నుంచి మీరు ఎస్బీఐ ఏటీయం కేంద్రాల నుంచి డబ్బులు విత్ డ్రా చేయాలంటే కచ్చితంగా ఓటీపీని ఎంటర్ చేయాల్సిందే. అంటే బ్యాంకు ఖాతాతో లింక్ అయ్యి వున్న సెల్ ఫోన్ ను వెంటబెట్టుకుని వెళ్లాల్సిందే. రూ.10వేలు, అంతకు పైబడి నగదు ఉపసంహరణకు ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చేసే లావాదేవీలకు ఓటీపీ విధానం వర్తిస్తుందని ఎస్బీఐ పేర్కొంది.
ఎస్బీఐ వినియోగదారులు ఏటీఎంలో నిర్దేశించిన సమయంలో నగదు విత్ డ్రా చేయడానికి వెళ్లేటప్పుడు స్క్రీన్ పై ఓటీపీ అడుగుతుంది. వారి రిజిస్టర్ మొబైల్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా లావాదేవీ జరపొచ్చు. ఓటీపీ ద్వారా కేవలం ఒక్క లావాదేవీ మాత్రమే చేయొచ్చని ఎస్బీఐ తెలిపింది. దీనివల్ల అనధికార లావాదేవీలను నివారించొచ్చని పేర్కొంది. ఎస్బీఐ వినియోగదారులు ఇతర ఏటీఎంల్లో గానీ, ఇతర బ్యాంకు కార్డు వినియోగదారులు ఎస్బీఐ ఏటీఎంల్లో గానీ ఈ సదుపాయాన్ని పొందలేరు.
ఈ మార్పు చేయడానికి ఏటీఎంల్లో పెద్ద మార్పులేమీ అవసరలేదని, జనవరి 1 నుంచి ఓటీపీ విధానం తీసుకొస్తున్నామని ఎస్బీఐ తెలిపింది. ఈ విధానం ద్వారా ఏటీఎం కేంద్రాల్లో క్లోనింగ్ కార్డుల ద్వారా జరిగే మోసాలకు చెక్ పెట్టేందుకు వీలవుతుంది. అయితే గ్రామీణ ప్రాంతంతో పాటు పట్టణ, నగరాల్లోని పేదలు డబ్బును విత్ డ్రా చేయాలంటే మాత్రం కొంత ఇబ్బందిని ఎదుర్కోక తప్పదు. ఇక నిర్జన ప్రాంతంలోని ఏటీయం కేంద్రాలతో పాటు.. రాత్రి వేళల్లో పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేసేవారిని రక్షణగా ఒక సిసిటీవీవి ఏటీయం కేంద్రాల బయట కూడా పెటాల్సిన అవసరం వుందని ఖాతాదారులు కొరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more