ఆంధ్రప్రద్రేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు వుండవచ్చునేమోనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకేతాలు ఇచ్చిన తరువాత రాజధాని అమరావతి ప్రాంత రైతులు బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కొనసాగుతున్న బంద్ లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ముందస్తు చర్యలను చేపట్టిన పోలీసులు 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఆదేశాలను జారీ చేస్తున్నట్లు తుళ్లూరు డిఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాలలో రాజధాని అంశంపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ముఖ్యంగా సచివాలయం వెళ్లే మార్గాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. తుళ్లూరు, మందడం, మంగళగిరిలో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానితుల గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. అయితే ఆందోళన కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించాలని ఇప్పటికే పోలీసులు సూచించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమాలపై ఇప్పటికే రాజధాని అమరావతితోపాటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు.
కాగా రైతుల పిలుపుమేరకు అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. స్థానికులు స్వచ్ఛందంగా వ్యాపార, విద్యాసంస్థలను మూసివేశారు. వెలగపూడిలో రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. రోడ్ల దిగ్బంధం, వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని రైతులు కోరుతున్నారు. అయితే ఆందోళన కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించాలని ఇప్పటికే పోలీసులు సూచించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమాలపై ఇప్పటికే రాజధాని అమరావతితోపాటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more