వ్యవసాయ రంగంలో శాస్త్రవేత్తలుగా మారి దేశానికి సేవా చేయాల్సిన ముగ్గురు విద్యార్థులు. వాటర్ ఫాల్స్ చూడ్డానికి వెళ్లి గల్లంతయ్యారు. రాష్ట్రం కాని రాష్ట్రంలో చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులు అక్కడి మరికోందరు తెలంగాణ విద్యార్థులతో కలసి బైక్ లపై పర్యాటక స్థలాల సందర్శనకు వెళ్లారు. ఆరు మందిలో ముగ్గురు వాటర్ ఫాల్స్ తో దిగి నడచుకుంటూ కొంత దూరం వెళ్లి.. ఆ తరువాత గల్లంతయ్యారు. దీంతో వారి కోసం రంగంలోకి దిగిన పోలీసులు, గజఈతగాళ్లు.. గల్లంతైన విద్యార్థుల కోసం అన్వేషించి వారి మృతదేహాలను కనుగొన్నారు.
ఈ ఘటన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్లో ఉన్న దుర్గావాడీ వాటర్ఫాల్స్ వద్ద చోటుచేసుకుంది. ఔరంగాబాద్ సమీపంలోని కంచన్ వాడీలోని ఛత్రపతి సాహు మహరాజ్ శిక్షన్ సంస్థాన్ అగ్రికల్చర్ వర్సిటీలో చదువుతున్న ఆరు మంది తెలంగాణ విద్యార్థులు కలసి వాటర్ఫాల్స్ చూడ్డానికి వెళ్లారు. అందులో.. అనూష(21), రఘువంశీ(21), కోటి రెడ్డి (20), గిరిధర్ ఆకాశ్(20), వెంకటేశ్వర్ రెడ్డి(20) కావ్య(20) ఉన్నారు. వీరంతా తమ కాలేజీ నుంచి బైక్ లపై దుర్గావాడీ వాటర్ పాల్స్ వెళ్లారు. వాటర్ ఫాల్స్ లో కొంత సేపు గడిపిన తరువాత.. కాగా అనూష, రఘువంశీ, కోటి రెడ్డి నీళ్లలోకి వాటార్ ఫాల్స్ నడుచుకుంటూ వెళ్తామని చెప్పారు.
దీంతో గిరిధర్ అకాశ్, వెంకటేశ్వర్ రెడ్డి, కావ్యలు తాము దిగిన హోటల్ గదికి వెళ్లారు. అయితే సాయంత్రమయినా ఇంకా తమ స్నేహితులు హోటల్ గదికి రాకపోవడంతో.. అందోళన చెందిన కావ్య, వెంకటేశ్వర్ రెడ్డి, అకాశ్ లు వారిని ఫోన్ చేశారు. స్థానికులు సాయంతో వారిని అన్వేషించారు. అయినా లాభం లేకపోవడంతో పోలీసులకు పిర్యాదు చేయగా.. వారు గల్లంతైన వారికోసం అన్వేషణ ప్రారంభించగా, దుర్గావాడీ ఫాల్స్ లో నీరు లేకపోయినా.. ఒక చోట మాత్రం నీళ్లు లోతుగా వుండటంతో అందులో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి.
తొలుత అనూష మృతదేహం నీటిపై తేలుతూ కనిపించగా, ఆ తరువాత సాయంత్రం ఐదు గంటల సమయంలో మిగిలిన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ రోజు ఉదయానికి మరో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ఘటనపై త్రయంబకేశ్వర్ తహసీల్దార్ దీపక్ గిరాసే మాట్లాడుతూ.. కోటి రెడ్డి ఇప్పటికే రెండు పర్యాయాలు త్రయంబకేశ్వర్ వాటర్ ఫాల్స్ కు వచ్చాడని, అతనే ఈ సారి కూడా తన ఇద్దరు స్నేహితులను సురక్షితంగా తీసుకువస్తాడని అభావించామని.. కానీ ఇలా అనూహ్య ఘటన చోటుచేసుకుంటుందని అనుకోలేదని అవేదన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more