AP Govt gives clarity on Capital ఏపీ రాజధానిపై క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కార్

Ys jagan government gives clarity on andhra pradesh new capital

Amaravati, YS Jagan Mohan Reddy, Botsa Satyanarayana, Legislative Council, Telugu Desam Party, Ashok Babu, YSRC, Andhra Pradesh, Politics

The Andhra Pradesh government on Friday categorically said there was no proposal to change the state capital from Amaravati, an assertion that could possibly put an end to uncertainty and speculation on the issue for over six months now.

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కార్

Posted: 12/13/2019 09:00 PM IST
Ys jagan government gives clarity on andhra pradesh new capital

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అమరావతిని రాజధానిగా కొనసాగించే అవకాశాలు లేవని మంత్రి బొత్స సత్యానారాయణతో పాటు పలువురు వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజధాని మారుతుందన్న విషయమై ఇటు రాష్ట్ర ప్రజలతో పాటు అటు అమరావతి రైతుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. దీనికి తోడు కేంద్రం జారీ చేసిన భారత దేశ పఠంలోనూ ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగానే వుండటంతో అందోళన నెలకొంది. అయితే ఆ తరువాత కేంద్రం జారీ చేసిన రెండో పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించింది. దీంతో కొంత క్లారిటీ వచ్చినా.. ఇంకా కొంత సంధిగ్ధం మాత్రం నెలకొంది.

అయితే తాజాగా దీనిపై జగన్ సర్కార్ క్లారిటి ఇచ్చింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శాసన మండలిలో చర్చ జరుగుతున్న సందర్భంలో టిడిపి సభ్యురాలు శమంతక మణి అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగుతుందని దీనిలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని ఆయన రాత పూర్వకంగా సమాధానమిచ్చారు. దీంతో గత కొంత కాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. దీని పై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

గతంలో కూడా బొత్స రాజధాని పై ప్రకటనలు చేశారు. అయితే ఇటీవల జరిగిన సమావేశాల్లో రాజధాని ప్రాంంతంలో పెండింగ్ పనులన్నింటిని వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో మంత్రి బొత్స శాసనమండలిలో ప్రకటన చేయడంతో రాజధాని అమరావతే అని స్పష్టమైతుంది. ఇది ప్రభుత్వం అధికారికంగా చెప్పిన ప్రకటనగానే భావించవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే ఇటీవల రాజధాని పెండింగ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అమరావతే రాజధాని అని తేలడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles