తెలంగాణ వెటర్నరీ వైద్యురాలు దిశ హత్యాచార కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంతో కథ ముగిసిపోయింది. అయితే ఈ నిందితుల పట్ల తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదని ఎన్ కౌంటర్ కు ముందు విమర్శలు వెల్లువెత్తిన పక్షంలో మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. దిశ హత్యాచార కేసులోని నిందితులకు.. చిన్నప్పుడు వారు వక్రమార్గం పట్టిన సమయంలో రెండు బెత్తం దెబ్బలు వేసి వుంటే.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చి వుండేవి కాదు అని వ్యాఖ్యానించారు.
కానీ ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న ఓ పత్రిక నిందితులకు రెండు బెత్తం దెబ్బలు చాలునని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారని వార్తను ప్రచురించింది. దీంతో ఈ వార్తను పట్టుకుని వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు. విమర్శలు గుప్పిస్తున్నారు. నా నాలుకకే కాదు చేతికి కూడా నరాలు లేవు అన్నట్లు వ్యవహరిస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ అంశమై జనసేనను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈ అంశంలో అధికార పార్టీ పవన్ కల్యాణ్ ను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు.. రంగంలోకి దిగారు.
పవన్ కల్యాణ్ ను జనసేన పార్టీని ఇబ్బందిపెట్టాలని ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలపై జనసేన నేత నాగబాబు విరుచుకుపడ్డారు. దిశ అత్యాచార నిందితుల విషయంలో పవన్ కల్యాణ్ ఏమన్నారో పూర్తిగా, సరిగ్గా వినండీ. అ తరువాత దీనిపై విమర్శలు చేయండి.. అంతేకాని దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అనే బాపతు ఆలోచనలు పక్కనపెట్టండని ఆయన వైసీపీ నేతలకు సూచించారు. ఇకపై కూడా ఇలాంటి విమర్శలే చేస్తే.. సహించబోమన్నారు. వైసీపీ నేతలకేనా నోటికి వచ్చినంత మాట్లాడే దమ్ము ధైర్యం ఉంది అని ప్రశ్నించారు.
తమకు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, నీతిమాలిన విమర్శలు చేయడం చేతనౌనని.. అయితే అలా చేయడానికి మాకు సంస్కారం అడ్డం వస్తుందని ఆయన అన్నారు. వైసీపీ నేతలు దిగజారుడు విమర్శలు చేస్తున్నారు.. సంస్కారాన్ని, వ్యక్తిత్వాన్ని మర్చి తమ స్థాయిని తామే తగ్గించుకుంటున్నారని నాగబాబు విరుచుకుపడ్డారు. అయితే అలాంటి విమర్శలు చేసేందుకు తమకు సంస్కారం అడ్డువస్తుందని.. కాబట్టి అనిగి ఉన్నామని అన్నారు. ఇక దిగజారుడు విమర్శలు చేయడంపై మీ వివేకానికే, విజ్ఞతకే వాటిని వదిలేస్తున్నామంటూ నాగబాబు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more