దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా.. రైతుల తలరాత మాత్రం మారడం లేదని.. ఆనాటి నుంచి ఈనాటి వరకు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే వున్నాయని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇలానే వుంటే.. అన్నదాతలు రానున్న కాలంలో కనుమరుగు అవుతాడని అందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వ్యవసాయం పండగ కాదు దండగా అని ఎందరో రైతన్నలు పట్టణాలకు వలసవచ్చి.. కూలీ పనులు చేసుకుని బతుకుబండిని సాగదీస్తున్నారని.. ఇప్పటికైనా అన్నదాతకు ఆపన్నహస్తం అందించకపోతే.. వారు మనజాలరని పవన్ అన్నారు.
రైతులు ఆరుగాల కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని ఈ సందర్భంగా పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ తీసుకువచ్చిందని అన్న ఆయన. ఆ నిధులు ఏమయ్యాయో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తీసుకువస్తే.. ఇక్కడ ధరలు చూస్తే.. మార్కెట్లకు తరలించేందుకు అయిన ఖర్చులు కూడా రావడం లేదని రైతన్నలు అందోళన వ్యక్తం చేశారు. రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాయలసీమలో జనసేన ‘ఆత్మీయ యాత్ర’లో భాగంగా చిత్తూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నిన్న ఉల్లి మార్కెట్ లో పర్యటించిన ఆయన.. ఇవాళ టమాటా మార్కెట్ లో పర్యటించి రైతుల కష్టాలను తెలుసుకుంటానని అన్నారు. ఏ వైసీపీ ఎమ్మెల్యే అపుతారో చూస్తానని కూడా సవాల్ చేసిన ఆయన అన్నమాట ప్రకారం మదనపల్లిలోని టమాటా మార్కెట్ ను సందర్శించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతన్నకు జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. రాష్ట్రంలో మతమార్పిడులపై ఉన్నంత శ్రద్ద రైతులపై ఎందుకు లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా రైతల గురించి పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఆంగ్లమాధ్యమంపై అమలు చేయాలా వద్దా అన్న విషయంపై హడావిడి చేస్తున్న ప్రభుత్వం ముందుగా రైతన్న ఆక్రందనలను అర్థం చేసుకోవాలని సూచించారు. అన్నదాతలకు అండగా నిలబడాలని డిమాండ్ చేశారు. పుడమి తల్లిని నమ్ముకున్న పుత్రుల సమస్యలను పరిష్కారించాలని అన్నారు. పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు అల్లాడిపోతున్నారు. ఇసుక లేక పనులు ఆగిపోయి భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చెందుతున్నారు’ అని పవన్ వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more