జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి నరకం అంటే ఏంటో తెలుసు. తాము రిజర్వు చేసుకున్న టికెట్లు వెయిటింగ్ లిస్టులో వుండిపోయి.. రైలు బయలుదేరుతున్నా.. కనీసం ఆర్ఏసీ కూడా కన్ఫామ్ కాకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు.. డబ్బులు లేక మరికొందరు.. అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చి ఇంకోందరు ఇలా అనేకమంది రైళ్లలోని జనరల్ బోగీల్లో అన్ రిజర్వుడ్ క్లాస్ లో ప్రయాణాలు సాగిస్తుంటారు. అయితే ఈ బోగీల్లో సీట్లు దొరకడం అంత తేలిక కాదు. సీట్లు దొరక్కపోయినా గమ్యస్థానాలకు చేరుకునే ప్రయాణికులు అనేక ఇబ్బందులను ఎదుర్కోంటుంటారు. అయితే వీరి కష్టాలను చూసిన రైల్వే శాఖ జనరల్ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది.
త్వరలో జనరల్ బోగీల్లో కూడా రిజర్వేషన్ సీట్లను పొందే సదుపాయం రైల్వే శాఖ కల్పిస్తోంది. ప్రస్తుతం ప్రయాణికులు ఎవరైతే జనరల్ బోగీల్లో సీట్లు పొందాలనుకుంటారో వాళ్లు రైలు మొదలయ్యే స్టేషన్ కు గంట ముందు చేరుకుంటూ ఉంటారు. కానీ రైల్వే శాఖ ప్రవేశపెడుతున్న కొత్త విధానం ద్వారా జనరల్ టికెట్లు తీసుకునే వారికి కూడా రైళ్లలో సీట్లు కన్ఫర్మ్ అవుతాయి. రైల్వే కౌంటర్లలో ప్రయాణికుడు తన ఐడీ కార్డును ఇచ్చి జనరల్ బోగీల్లో రిజర్వేషన్ సీట్లను పొందవచ్చు.
రైల్వే కౌంటర్లలో ప్రయాణికుడు ఇచ్చిన ఐడీ కార్డును సిబ్బంది ఫోటో తీస్తారు. ప్రయాణికుడి వాట్సాప్ నంబర్ కు డిజిటల్ టికెట్ ను సిబ్బంది పంపుతారు. జనరల్ కంపార్ట్మెంట్లలో కేటాయించిన సీట్లలో కూర్చొని ప్రయాణికులు ప్రయాణం చేయవచ్చు. రైల్వే శాఖ ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా దానాపూర్ డివిజన్ లో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. పాస్ ఫర్ అన్రివార్డెడ్ బోర్డ్( పియుఆర్బి) అనే పేరుతో రైల్వే శాఖ ఈ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టింది.
రైల్వే శాఖ కొన్ని నెలల తరువాత దేశమంతటా ఈ విధానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉందని సమాచారం. ఈ విధానం అందుబాటులోకి వస్తే ప్రయాణికులు రైళ్లలో జనరల్ బోగీల్లో కూడా ప్రశాంతంగా ప్రయాణం చేసే వీలు ఉంటుంది. తరచుగా రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ఈ విధానాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకొనిరావాలని కోరుతున్నారు. రైల్వే శాఖ దానాపూర్ డివిజన్ లో చేపట్టిన ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మొదట నగరాల్లో ఆ తరువాత పట్టణాల్లో జనరల్ టికెట్ల ద్వారా రిజర్వేషన్ సీట్లను పొందే సదుపాయాన్ని కల్పించబోతుందని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more