ఎన్నికల వేళ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని గేలి చేయబోయి అధికార పార్టీకి చెందిన నేత డివి సదానంద గౌడ్ బొక్కబోర్లా పడ్డారు. సదానంద చేసిన వ్యాఖ్యలను కూడా తెలివిగా తనకు అనుకూలంగా మలుచుకోవడంలో కుమారస్వామి పైచేయి సాధించారు. అంతేకాదు తమ కార్యకర్తలతో పాటు ఓటర్ల మన్ననలను కూడా అందుకున్నారు. సరిగ్గా మరో వారం పది రోజుల్లో ఉపఎన్నికల ముందు బీజేపి నేతలకు ఎదురుదెబ్బలు తగలడం చర్చనీయాంశంగా మారుతోంది. అసలే ప్రభుత్వ మనుగడకు ఈ ఎన్నికలకు వున్న బంధంతో అటు బీజేపి ఇటు ప్రతిపక్షాలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి.
కర్ణాటకలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 15 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడంతో.. ఖాళీ అయిన ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాండ్యా లోక్ సభ నియోజకవర్గానికి వెళ్లిన కుమారస్వామి.. అక్కడి ప్రజలు తనను వీడిపోయారి కొంత భావోద్వేగానిక గురయ్యారు. తన కుమారుడిని నిఖిల్ ను ఇక్కడి నుంచి బరిలో నిలిపితే.. ప్రత్యర్థిని గెలిపించారని వ్యాఖ్యానించారు. తనకు ముఖ్యమంత్రి పదవి వద్దూ ఏమీ వద్దని, తనకు మాండ్యా ప్రజల అశీస్సులు కావాలని ఆయన కోరారు.
ఈ నేపథ్యంలోనే కుమారస్వామిపై బీజేపి నేతలంతా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే మరో అడుగు ముందుకేసిన కేంద్రమంత్రి సదానంగ గౌడ దానిపై స్పందిస్తూ.. కన్నీళ్లు పెట్టుకోవడం వారి కుటుంబానికి అలావాటేనని వ్యాఖ్యానించారు. ‘ఎన్నికలప్పుడే కుమారస్వామికి కన్నీళ్లొస్తాయి. ఆయన వద్ద ఎప్పుడూ విక్స్, అమృతాంజన్ ఉంటాయి’ అని మరో వ్యంగ్యాన్ని ప్రదర్శించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కుమారస్వామి కేంద్ర మంత్రి డి.వి.సదానందగౌడపై కుమార నిప్పులు చెరిగారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలుచుకున్నారు.
కుమారస్వామి ఏమన్నారంటే ‘‘పేదల కష్టాలకు స్పందించే హృదయం మాది కాబట్టి కన్నీళ్లొస్తాయి. కన్నీళ్లు మా మేథోహక్కు’’ అని సమర్థించుకున్నారు. అవసరమైతే కేంద్ర గూఢచార సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తే మా ఇంటివద్ద బారులుదీరిన పేదలు కనిపిస్తారన్నారు. నాటకాలు ఆడే మీలాంటి వాళ్లకు కన్నీటి విలువ తెలియదని తనపై వచ్చిన విమర్శలను కుమారస్వామి తిప్పికొట్టారు. మావి సహజమైన కన్నీరు.. బీజేపి నేతలవి గ్లిజరిన్ కన్నీరని వ్యాఖ్యానించిన ఆయన.. సదానంద గౌడవి మాత్రం మొసలికన్నీరేనని తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more