రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ పశు వైద్యురాలిపై కొందరు మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. జిల్లాలోని షాద్ నగర్ సమీపంలో అమెను సజీవ దహనం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట్ మండలం కొల్లూర్ గ్రామంలో అమె వెటర్నరీ వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న ఆమె యధావిధిగా నిన్న సాయంత్రం కూడా విధులు ముగించుకుని ఇంటికి తిరిగివస్తూ.. అగంతకుల చేతిలో హత్యకు గురైంది. అమె శవాన్ని కూడా అగంతకులు దహనం చేశారు. షాద్ నగర్ మండలం చలాన్ పల్లి గ్రామ శివార్లలో ఓ బ్రిడ్జి ఓవర్ రోడ్డు అమె పూర్తిగా కాలిన శవాన్ని పోలీసులు గుర్తించారు.
మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నర్సయిపల్లి గ్రామానికి చెందిన అమె.. ప్రస్తుతం శంషాబాద్ లో స్థిరపడ్డారు. ప్రతీరోజూ స్కూటీ మీద ప్రియాంకారెడ్డి విధులకు వెళ్లే వస్తూండేది. యధావిధిగా బుధవారం కూడా విధులకు వెళ్లిన ప్రియాంక.. తన స్కూటీ మార్గమధ్యంలో పాడుకావడంతో అందోళనకు గురైంది. అప్పటికే రాత్రి కావడంతో తన పరిస్థితిని తన సోదరికి ఫోన్ ద్వారా చెప్పింది ప్రియాంక. తన సోదరి భయపడుతూ తనకు ఫోన్ చేసిందని, అక్కడ లారీ డ్రూవర్లు తిరుగుతూ ఉండటంతో భయంగా వుందని చెప్పిందని ప్రియాంక సోదరి మీడియాకు తెలిపారు.
కొందరు స్థానికులు అమెకు సాయం చేసేందుకు ప్రయత్నించారని, అమె స్కూటీని రిపేర్ చేయిస్తామని తీసుకెళ్లినా.. రాత్రి సమయం కావడంతో దుకాణాలు మూసివున్న కారణంగా మళ్లీ తిరిగి తీసుకువచ్చారని తనకు చెప్పిందని ప్రియాంక సోదరి తెలిపారు. దీంతో నిర్జన ప్రాంతంలో ఎక్కువ సేపు ఉండటం ఎందుకు.? స్కూటీని అక్కడే వదిలేసి నువ్వు మాత్రం టోల్ గేట్ వద్దకు వచ్చేయ్ అని తాను ప్రియాంకతో చెప్పానని, అయినా అమె తన మాటలను పట్టించుకోలేదని, తన చెల్లి తిరిగిరాకపోవడంతో.. ఇంత ఘోరం జరుగడం తమను కలిచివేస్తుందని ప్రియాంక సోదరి తెలిపారు.
అయితే ప్రియాంక రెడ్డిని ఎవరు హత్య చేశారనే అంశంపై అనేక అనుమానాలు తలెత్తున్నాయి. ప్రియాంక రెడ్డి అనుమానించినట్టుగా లారీ డ్రైవర్లే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టి... అనంతరం హత్య చేశారా? అనే కోణంలోనే పోలీసులు ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాలంటే... సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించాల్సి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రియాంక తన చెల్లెలికి చివరిసారీగా ఫోన్ చేసిన సమయంలో ఎక్కడ ఉన్నట్టు చెప్పిందనే విషయంపై ఆరా తీస్తున్న పోలీసులు... అక్కడ సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.
దీంతో పాటు ఆమె ఫోన్ నుంచి చివరిసారి ఎవరికి ఫోన్ చేసిందనే విషయం తెలిస్తే... ప్రియాంక హత్య కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉందని పోలీసులు భావించారు. ప్రియాంకపై అత్యాచారానికి పాల్పడిన లారీ డ్రైవర్లు అమెను హత్య చేసి దహనం చేయాల్సిన అసవరమేంటని కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. జరిగిన నేరాన్ని బట్టి చూస్తే నేరస్థులకు ప్రియాంపై ఏదో కక్షసాధింపు సాగించినట్టుగా వుందని, ఈ కోణంలోనూ పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం నాలుగు బృందాలుగా విడిపోయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more