సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువైన వైకుంఠానికి వెళ్లే ద్వారం వైకుంఠ ద్వారం. దీన్ని ఉత్తర ద్వారమని కూడా భక్తులు పిలుస్తుంటారు. పుష్యమీ మాసంలో వచ్చే శుద్ద ఏకాదశిని భక్తులు వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తుంటారు. ఈ పర్వదినాన అన్ని వైష్ణవాలయాల్లో సాధారణంగా భక్తులు దర్శనానికి వెళ్లే తూర్పు ద్వారాల గుండా కాకుండా భక్తులను ఉత్తర ద్వారాల నుంచి దర్శనానికి పంపిస్తుంటారు. ఉత్తర ద్వారాల నుంచి స్వామిని దర్శించుకునేందుకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో భక్తులు పోటీపడుతుంటారు.
అయితే ద్వాదశి రోజున కేవలం పరమపవిత్రమైన ఫుణ్యక్షేత్రాల్లో మాత్రమే.. అదీనూ భక్తుల రద్దీని దృష్ట్యా మాత్రమే అనుమతిస్తారు. అప్పుడు మినహా సంవత్సరంలో మరెప్పుడూ ఆ ద్వారా దర్శనం అందుబాటులో వుండదు. అయితే సరిగ్గా ఈ పవిత్రమైన రోజులలో ఉత్తరద్వార దర్శనాల ద్వారా భక్తులను అనుమతించేందుకు కారణం కూడా వుంది. ఈ ఉత్తర ద్వారం నుంచి వెళ్లి స్వామివారిని దర్శించుకునే భక్తులకు ముక్తి లభిస్తుందని భక్తులు విశ్వాసం. ఇక అల వైకుంఠానికి చేరుకునే క్రమంలో ఇల వైకుంఠమైన తిరుమలలో ఉత్తర ద్వారా దర్శన భాగ్యం లభించే భక్తులు కొందరే. దీంతో ఆ అవకాశాన్ని ఇకపై భక్తులందరికీ కలిగించేందుకు టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే పరిమితమైన ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని 10 రోజులు తెరచి ఉంచాలని టీటీడీ నిర్ణయించింది. ఈ పది రోజులూ ఇవే ద్వారాల గుండా భక్తులను అనుమతించేందుకు నిర్ణయించింది. అనగా వచ్చే ఏడాది జనవరి 6న రానున్న వైకుంఠ ఏకాదశి మొదలుకుని బహుళపక్షంలో వచ్చే పంచమి వరకు అంటే రమారమి సంక్రాంతి, కనుమ పర్వదినాలలోనూ భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని కల్పించనుంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.
ఈ నిర్ణయం తీసుకునేముందు టీటీడీ పాలక మండలి సభ్యులు ఆగమ శాస్త్ర నిపుణులను కూడా పరిగణలోకి తీసుకుని వారి నుంచి అంగీకారం పోందిన పిమ్మటే నూతన విధానాన్ని అమలులోకి తెస్తామని అధికారులు అంటున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు ద్వారాలను తెరిచి, ఆపై 10 రోజుల పాటు వీటి గుండా భక్తులను పంపాలని, ఈ నిర్ణయం వల్ల రద్దీని గణనీయంగా తగ్గించవచ్చని, మరింత మందికి వైకుంఠ దర్శనం కల్పించే వీలుంటుందని అధికారులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more