నిధుల లేమితో అంగలార్చుతున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ఆదాయ వనురుగా అవతరించిన మద్యాన్ని వదులేసుకుంది. ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని మహిళా ఓటర్లకు ఇచ్చిన మాటకు కట్టుబడిన వైసీపీ ప్రభుత్వం మద్యం దుకాణాలను నియంత్రిస్తూ కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకువచ్చింది. దీంతో రాష్ట్రానికి ఆదాయం తగ్గింది. అయితే తగ్గిన ఆదాయాన్ని మరోలా రాబట్టుకునేందుకు ఏకంగా మధ్యం ధరలకు కూడా విపరీతంగా పెంచింది అక్కడి ఎక్సైజ్ శాఖ. ఈ విధానం ఆంధ్ర సరిహద్దు జిల్లాల్లోని తెలంగాణ మద్యం దుకాణాల వ్యాపారుల పాలిట కలిసివస్తోంది.
అంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మందుబాబులు ఏకంగా తెలంగాణకు క్యూకడుతున్నారు. తెలంగాణలో మద్యం ధరలు తక్కువ కావడంతో పాటు దుకాణాలు కూడా రాత్రి పదకొండు గంటల వరకు తెరచి వుండటంతో మందుబాబు.. ఏపీలో డబ్బులు పెట్టి మద్యం కొనడం కంటే.. తెలంగాణలో మద్యం కొనుగోలు చేయడం తమకు కలసి వస్తుందని, తక్కువ ధరకే కిక్కు లభిస్తోందని బారులు తీరుతున్నారు. తమ రాష్ట్రంలో రాత్రి 8 గంటలకే దుకాణాలు మూతపడుతుండడంతో అల్లాడిపోతున్న సరిహద్దు గ్రామాల్లోని మద్యం ప్రియులు తెలంగాణ మద్యం పాలసీకి జై కోడుతున్నారు.
దీంతో ఏపీ సరిహద్దులోని తెలంగాణ గ్రామాల్లో ఉన్న మద్యం దుకాణాలకు సరికొత్త కళ వచ్చిచేరింది. అటు నల్గోండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల మద్యం దుకాణాలు కళకళలాడుతున్నాయి. గతంతో పోలిస్తే ఏకంగా మూడు రెట్లు అధికంగా మద్యం అమ్ముడుపోతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఏపీలోని తెలంగాణ సరిహద్దు గ్రామాలైన కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, వీరులపాడు మండలాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్నాయి. ఈ మండలాల్లోని ప్రజలు తమకు సమీపంలోని తెలంగాణ పల్లెల్లో ఉన్న మద్యం దుకాణాలపై పడుతున్నారు.
దీంతో సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలోని మద్యం షాపులకు తాకిడి పెరిగింది. ఇటు కర్నూలు జిల్లాకు అనుకుని వున్న మహబూబ్ నగర్ జిల్లాలోనూ అదే పరిస్థితి కనబడుతోంది. కొందరు ఇదే అదునుగా అక్రమ అమ్మకాలకు తెరతీశారు. తెలంగాణ నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చిన మద్యాన్ని స్థానికంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నందిగామ ఎక్సైజ్ అధికారులు తెలంగాణ నుంచి మద్యంప్రియులు అక్రమంగా తీసుకొచ్చిన 203 మద్యం సీసాలను పట్టుకున్నారు. చందర్లపాడుకు చెందిన యంపతి మల్లేశ్వరి, పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన కోపల్లి ప్రకాశ్రావును అదుపులోకి తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more