మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో గత 20 రోజులుగా ఏర్పడిన ప్రతిష్టంభనపై ఆ రాష్ట్ర గవర్నర్ తనదైన నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో బీజేపి తరువాతి స్థానంలో నిలిచిన రెండు పార్టీలను ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అయితే వారు నిర్ణయం తీసుకునేందుకు ఇచ్చిన గడువు కూడా ముగియకుండానే.. ఆఘమేఘాల మీద కేంద్రానికి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ.. సిఫార్సు చేశారు. మహారాష్ట్ర గవర్నర్ పంపిన సిఫార్సును ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ కూడా అంతే వేగంగా రాష్ట్రపతి పాలనకు జై కొట్టింది.
తమకు ఇచ్చిన గడువు ముగియకుండానే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం మహారాష్ట్ర ప్రజాతీర్పుపై సర్జికల్ స్ట్రైక్ చేసినట్లుగా వుందని విపక్షాలు అరోపిస్తున్నాయి. ఈ విషయంలో ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కూడా శివసేన సిద్దమైంది. దీంతో గత 20 రోజులు ట్విస్టుల సుడిగుండంలో తిరిగిన మహా రాజకీయాలకు రాష్ట్రపతి పాలనతో బ్రేక్ పడనుంది. మహారాష్ట్రలో గత ప్రభుత్వ పదవీకాలం ఈ నెల 9న ముగిసింది. ఈ క్రమంలో మహారాష్ట్ర ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న దేవేంద్ర ఫడ్నావిస్ కూడా తన పదవికి రాజీనామా చేశారు.
అయితే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అహ్వానించినా.. అందుకు బీజేపి వ్యతిరేకించింది. తమ వద్ద తగినంత బలం లేదని, దీంతో తాము నిర్ణీత సమయంలో బలనిరూపణ చేయలేమని వెనుకంజ వేసింది. దీంతో గవర్నర్ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించారు. అందుకుగానూ గవర్నర్ శివసేనకు నిర్ణీత గడువును కూడా ఇచ్చారు. అయితే గడువు ముగియకుండానే గవర్నర్ ఎన్సీపీని అహ్వానించారు. వారికి కూడా ఇవాళ సాయంత్రం వరకు గడవు ఇచ్చారు. అయితే గడవు ముగిసిపోకముందే వేగంగా నిర్ణయాలు తీసుకుని మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ ఆయన కేంద్రానికి సిఫార్సు చేయడం.. కేంద్ర క్యాబినెట్ భేటీ అయ్యి సిఫార్సును అమోదించడం చకచకా జరిగిపోయాయి.
అయితే, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలు కావడం ఇది మూడో పర్యాయం. 1980లో తొలిసారి, 2014లో రెండోసారి ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలైంది. 1980 ఫిబ్రవరి 17 నుంచి 1980 జూన్ 8 వరకు 112 రోజుల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉన్నా కూడా ఆయన ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసి.. రాష్ట్రపతి పాలన విధించింది. ఆ తర్వాత 2014 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 31 వరకు 33 రోజుల పాటు రెండోసారి రాష్ట్రపతి పాలన నడిచింది. ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్.. ఎన్సీపీ, ఇతరుల నుంచి విడిపోవడంతో ప్రభుత్వం సస్పెండ్ అయింది. తాజాగా మూడోసారి నవంబర్ 12 నుంచి మూడోసారి అమల్లోకి వచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more