ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ ఎంపీ సుజనాచౌదరి మండిపడ్డారు. జగన్ పాలనపై దృష్టి సారించట్లేదని.. వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రానికి నష్టం వాటిల్లుతున్నదని వివరించారు. 'ఏపీలో ఒక్క పరిశ్రమ కొత్తగా రాలేదు. ప్రభుత్వ విధానాలతో పారిశ్రామిక వేత్తలు రాని పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా పాలనపై దృష్టి సారికంచకపోతే రాష్ట్రం కోలుకోవడం కష్టమ‘ని సుజనా చౌదరి అన్నారు. వైకాపా ప్రభుత్వం ఈ ఐదు నెలల్లో తీసుకున్న నిర్ణయాలు సక్రమంగా అమలు కావడం లేదన్నారు. ఒక ప్రణాళిక లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనర్థాలు వస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీపై స్పందించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేసిన విధానం ఘోరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఏపీలో అయోమయ, అంధకార పాలన సాగుతోందన్నారు. రాజ్యాంగ సంక్షోభం దిశగా ఏపీ ప్రభుత్వం నడుస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ‘ఇది రాచరిక జమానా కాదు.. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇలా చేయడం సరికాదు. ఐదు నెలలుగా అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా హోల్డ్లో ఉంచారు. సామాజిక వర్గాలుగా సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం అన్నీ గమనిస్తోంది.. కళ్లు మూసుకుని లేదు. ఇసుక ద్వారా కేవలం రూ.300కోట్ల వరకే ఆదాయం, అంతకు మించి రాదు. ఇసుక కొరత, వరదల నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది’ అని సుజనా విమర్శలు గుప్పించారు.
అమరావతి నోటిఫికేషన్ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు. నోటిఫికేషన్ రానందు వల్లే మ్యాప్లో అమరావతి లేదుని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి చెప్పుకొచ్చారు. చంద్రబాబు తప్పుల వల్లే వైసీపీకి అధికారంలోకి వచ్చిందని సుజనా తెలిపారు. వైసీపీ పాలనలో ప్రజలు సంతోషంగా లేరన్నారు. ‘ఏపీలో బీజేపీకి వైసీపీ, టీడీపీ ప్రత్యర్థులే. పీపీఏలపై ఏపీ ప్రభుత్వం చేసేదేం లేదు. రివర్స్ టెండరింగ్ చేశారు కానీ... పోలవరం అథారిటీ అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే పవన్లాంటి వారిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారే తప్ప.. సమస్య పరిష్కారానికి చొరవ చూపడంలేదు’ అని సుజనాచౌదరి విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more