BJP MP Sujana Choudary slams YS Jagan Govt జగన్ సర్కారు వ్యవహర తీరుపై సుజనా గరం.. గరం..

Bjp mp sujana choudary slams ys jagan govt says center is wacthing

Jagan Mohan Reddy, ys rajsekhara reddy, YSR Reddy, YS Jagan, Chief Minister, Sujana Choudary, LV Subramanyam, Chief Secretary, BJP MP, Andhra Pradesh, Politics

BJP MP Sujana Chowdary slams YSRCP Government Over various issues says AP govt been mislerably failure in fullfilling the dreams of people of Andhra Pradesh. He also fires YCP on Targetting Political Leaders Personally, Sand policy and CS transfer.

జగన్ సర్కారు వ్యవహర తీరుపై సుజనా గరం.. గరం..

Posted: 11/05/2019 02:58 PM IST
Bjp mp sujana choudary slams ys jagan govt says center is wacthing

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ ఎంపీ సుజనాచౌదరి మండిపడ్డారు. జగన్ పాలనపై దృష్టి సారించట్లేదని.. వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రానికి నష్టం వాటిల్లుతున్నదని వివరించారు. 'ఏపీలో ఒక్క పరిశ్రమ కొత్తగా రాలేదు. ప్రభుత్వ విధానాలతో పారిశ్రామిక వేత్తలు రాని పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా పాలనపై దృష్టి సారికంచకపోతే రాష్ట్రం కోలుకోవడం కష్టమ‘ని సుజనా చౌదరి అన్నారు. వైకాపా ప్రభుత్వం ఈ ఐదు నెలల్లో తీసుకున్న నిర్ణయాలు సక్రమంగా అమలు కావడం లేదన్నారు. ఒక ప్రణాళిక లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనర్థాలు వస్తున్నాయని ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీపై స్పందించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేసిన విధానం ఘోరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఏపీలో అయోమయ, అంధకార పాలన సాగుతోందన్నారు. రాజ్యాంగ సంక్షోభం దిశగా ఏపీ ప్రభుత్వం నడుస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ‘ఇది రాచరిక జమానా కాదు.. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇలా చేయడం సరికాదు. ఐదు నెలలుగా అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా హోల్డ్‌లో ఉంచారు. సామాజిక వర్గాలుగా సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం అన్నీ గమనిస్తోంది.. కళ్లు మూసుకుని లేదు. ఇసుక ద్వారా కేవలం రూ.300కోట్ల వరకే ఆదాయం, అంతకు మించి రాదు. ఇసుక కొరత, వరదల నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది’ అని సుజనా విమర్శలు గుప్పించారు.

అమరావతి నోటిఫికేషన్‌ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు. నోటిఫికేషన్‌ రానందు వల్లే మ్యాప్‌లో అమరావతి లేదుని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి చెప్పుకొచ్చారు. చంద్రబాబు తప్పుల వల్లే వైసీపీకి అధికారంలోకి వచ్చిందని సుజనా తెలిపారు. వైసీపీ పాలనలో ప్రజలు సంతోషంగా లేరన్నారు. ‘ఏపీలో బీజేపీకి వైసీపీ, టీడీపీ ప్రత్యర్థులే. పీపీఏలపై ఏపీ ప్రభుత్వం చేసేదేం లేదు. రివర్స్‌ టెండరింగ్‌ చేశారు కానీ... పోలవరం అథారిటీ అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే పవన్‌లాంటి వారిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారే తప్ప.. సమస్య పరిష్కారానికి చొరవ చూపడంలేదు’ అని సుజనాచౌదరి విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP CM YS Jagan  YSRCP  BJP  Jagan Mohan Reddy  sujana choudary  PM Modi  Andhra Pradesh  Politics  

Other Articles