తెలుగు ఇండస్ట్రీ మోస్ట్ కాంట్రవర్సియల్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్కు బెయిల్ దొరికింది. మరో నిర్మాత పివిపి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈయన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జూబ్లీహిల్స్ నుంచి కడప వరకు వెళ్లింది వ్యవహారం. అక్కడి కోర్టు బండ్లకు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. అంటే నవంబర్ 4 వరకు ఈయన జైల్లోనే ఉండాల్సింది. కానీ ఓ మంత్రి రాయబారంతో ఈయనకు ఊహించని విధంగా బెయిల్ వచ్చింది. కచ్చితంగా జైలుకు వెళ్తాడనుకున్న ఈయనకు మినిస్టర్ తెరవెనక చేసిన పనులే బయటపడేసాయని తెలుస్తుంది.
ఆఘమేఘాల మీద బండ్ల గణేష్కు బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బండ్ల కడప నుంచి హైదరాబాద్ వస్తున్నాడు. అసలు ఈ కేస్ ఎక్కడ మొదలైందనేది ఒక్కసారి చూసుకుంటే.. దాదాపు 8 ఏళ్ల కింద అంటే 2011లో కడపలోని మహేష్ అనే వ్యక్తి నుంచి 13 కోట్ల అప్పు తీసుకున్నాడు బండ్ల గణేష్. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఈయనపై 2013లో మహేష్ చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసాడు. అప్పుడే కడప పోలీసులు బండ్ల గణేష్పై కేసులు నమోదు చేశారు. చాలాసార్లు కోర్టుకు హాజరు కాకపోవడంతో కడప జిల్లా మేజిస్ట్రేట్ ఈ నిర్మాతపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చేసారు. ఇంతలోనే నిర్మాత పీవీపీ కూడా ఈ మధ్యే బండ్ల గణేష్పై పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
తన ఇంటికి కొందరు అనుచరులను తీసుకొచ్చి బెదిరించాడని ఫిర్యాదు చేసాడు ఈయన. అందుకే జూబ్లీహిల్స్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కడప తీసుకెళ్లి అక్కడ రిమాండ్కు తరలించండంటూ కోర్టు చెప్పిన వెంటనే ఓ కీలక నేత రంగంలోకి దిగి బండ్ల గణేష్కు బెయిల్ వచ్చేలా చేసాడని తెలుస్తుంది. ప్రస్తుతం జగన్ హయాంలో మంత్రిగా ఉన్న ఓ నేత బండ్ల గణేష్కు అత్యంత ఆప్తుడు. ఆయనకే బినామీ అంటూ చాలా రోజులు వార్తలు వచ్చాయి కూడా. ఇప్పుడు ఈయనే మళ్లీ మనోడ్ని బయటికి తీసుకొచ్చాడని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా జైలుకు వెళ్లాల్సిన బండ్ల.. బండెక్కి హైదరాబాద్ వచ్చేస్తున్నాడన్నమాట.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more