జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలీసు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ అమ్మాయి తన కుటుంబపోషణ కోసం రోడ్డు ఎక్కితే.. ఆమెపై చులకన భావంతో అసభ్యకర పోస్టులు పెడుతున్న అకతాయిలపై పోలీసులు తీసుకుంటున్న చర్యలేమిటని ఆయన ప్రశ్నించారు. యువతిని కులం పేరుతో కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వేధిస్తున్నారని పిర్యాదు చేసినా.. అకతాయిల ఆటలు నిరాటంకంగా సాగుతున్నాయని.. ఇదేనా పోలీసుల పనితీరుకు దర్పణమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పిర్యాదు చేయగానే పోలీసులు స్పందిస్తే.. అకతాయిల ఆగడాలకు కళ్లెం పడుతోందని అన్నారు.
అలా కాకుండా పిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆకతాయిలు మరింత శృతిమించుతున్నారని, దీంతో జరగకూడని అనర్ధాలు కూడా జరుగుతున్నాయని.. ఆయన అందోళన వ్యక్తం చేశారు. ఆనర్థాలు జరిగిన తరువాత స్పందించడం కంటే జరుగుతొందని తెలియగానే స్పందించి నివారించగలగడమే పోలీసుల కర్తవ్యమని ఆయన సూచించారు. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న అనంత స్వాతి పవన్ కల్యాణ్కు ఫిర్యాదు చేసింది. దీంతో ఘటనపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా విషయంలో సరైన చట్టాలు లేవు కనుకే కొంతమంది అసభ్య పోస్టులతో పెట్రేగిపోతున్నారని అన్నారు. త్వరలోనే సోషల్ మీడియా నియమాలు మరింత కఠినతరం కానున్నాయని, అప్పుడు ఇలా పెట్రేగిపోతున్న వారందరికి శిక్ష తప్పదని అన్నారు. అటు.. ఘటనపై పోలీసుల అలసత్వాన్ని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ‘వైసీపీ నాయకులపై సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే చాలు వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నారని కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు. ఒక ఆడ బిడ్డ మీద నీచంగా పోస్టులు పెట్టి, కులాన్ని దూషిస్తే మాత్రం పోలీసు అధికారులు స్పందించడం లేదని ఆయన ఫైరయ్యారు.
అదే సమయంలో మన కోసం తిరిగిన ఆడపిల్లను రక్షించుకోకపోతే సిగ్గు చేటు అని కాగా, ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని భగీరథ కెమికల్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయించాలని, ఆ ఫ్యాక్టరీ కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్ధాలతో భూగర్భ జలాలు కలుషితమై పచ్చని పంట పొలాలు నాశనమైపోతున్నాయని, ఆ నీటిని తాగిన పశువులు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more